RCB vs GT: ఐపీఎల్లో ఒక్క చిన్న పొరపాటు మ్యాచ్పరిస్థితులను మర్చతుంది. నిన్నటి మ్యాచ్లో అదే జరిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. డకౌట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక లైఫ్ దొరికిన విరాట్ రెచ్చిపోయి 81 పరుగులు సాధించాడు. చివరకు మ్యాచ్ను గెలిపించాడు. అసలు ఏం జరిగిందంటే..? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్ (GT)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం నమోదు చేసింది. శుక్రవారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓవర్లలో 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో 20 ఓవర్లలో 205/3 భారీ స్కోరును నమోదు చేసింది. సుదర్శన్ సెంచరీ చేసినా ఫలించలేదు. ఇక, ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ (81), దేవదత్ పడిక్కల్ (55) అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపు తిప్పేశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది.
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి మొదట్లోనే గట్టి షాక్ తగిలేలా కనిపించింది. మొదటి ఓవర్లోనే విరాట్ను పెవిలియన్కు పంపే అవకాశాన్ని గుజరాత్ మిస్ చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు. మహమ్మద్ సిరాజ్ మొదటి ఓవర్లో ఒక లూప్ డెలివరీని విరాట్ సరిగ్గా అంచనా వేయలేదు. షాట్ ఆడటంలో కాస్త తడబడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్-వికెట్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ చేతుల్లోకి నేరుగా వెళ్లింది. వాస్తవానికి ఇది చాలా ఈజీ క్యాచ్. కానీ.. వాషింగ్టన్ సుందర్ దాన్ని జారవిడిచాడు. దీంతో బౌలర్ సిరాజ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కోహ్లీని సున్నా పరుగులకే ఔట్ చేసి గుజరాత్ను పైచేయి సాధించేలా చేసే సువర్ణావకాశాన్ని సుందర్ చేజార్చాడు. ఈ తప్పిదం మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేసింది.
