Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: నిన్న లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(43) రాణించాడు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఘోర పరాజయం అనంతరం.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తామ టీమ్ చెత్త బ్యాటింగ్ వల్లే ఓడిపోయామని స్పష్టం చేశాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగే అని పంత్ అంగీకరించాడు. తాను సైతం నిందించుకున్నాడు. తనతో పాటు బ్యాటర్లందరూ విఫలమయ్యారన్నాడు. బౌలర్లు గత మ్యాచ్ కంటే మెరుగ్గా రాణించి తమ పనిని చక్కగా పూర్తి చేశారని కొనియాడాడు. కానీ బ్యాటర్లే తమ బాధ్యతను నెరవేర్చలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఓటమికి కారణాలను బయట ఎక్కడో వెతకడం కంటే, జట్టు లోపలే వెతుక్కోవాలని పంత్ సూచించాడు. జట్టుగా అందరూ నిరాశలో ఉన్నప్పటికీ, పరిష్కార మార్గాలను కనుగొనడం ముఖ్యమని చెప్పాడు. బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు క్రీజులో కొంచెం డీలే అవుతుందన్నాడు. బ్యాటింగ్ సమయంలో మేం కాస్త టైమ్ తీసుకొని ఆడాల్సిందని తెలిపాడు. ఈ విషయంలో తనతో సహా బ్యాటర్లందరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశాడు. తమ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తగినంత సత్తా (firepower) ఉందని పంత్ ధీమా వ్యక్తం చేశాడు. జట్టుగా ఈ ఓటమి తమకు నిరాశ కలిగిస్తుందని.. కానీ తాము ఇంకా సానుకూల అంశాల వైపే చూడాలనుకుంటున్నామన్నాడు. తమ బలహీనతలను సరిదిద్దుకోవాలని.. బౌలింగ్, బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉందన్నాడు. తాము కచ్చితంగా పుంజుకుంటామని నమ్మకం వ్యక్తం చేశాడు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 159 పరుగులు చేసింది. ఇక 160 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ రంగంలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే చెతికిలపడింది. తొలి ఓవర్లోనే ఆయుష్ బదోని రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అనంతరం ఐడెన్ మార్క్రమ్ సైతం ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. లక్నో టాప్-ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ అర్ధశతకం సాధించాడు. అయితే, మార్ష్ సైతం అవుట్ అవ్వడంతో లక్నో జట్టు తీవ్రంగా తడబడింది. 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో లక్నో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!