Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్ అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ స్పందించారు. లక్నోతో జరిగిన మ్యాచ్లో మహ్మద్ షమీ వేసిన అద్భుతమైన షార్ట్ పిచ్ బంతికి ప్రియాంశ్ ఆర్య మిడ్-వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా వెనుతిరిగాడు. ఆర్య వరుసగా రెండోసారి డకౌట్ కావడం (గత మ్యాచ్లో ఆర్సీబీపై కూడా డకౌట్ అయ్యాడు) అతని బ్యాటింగ్ లోపాలను స్పష్టం చేస్తోందని తివారీ పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలర్లు అతని బలహీనత అయిన షార్ట్ పిచ్ బంతులను టార్గెట్ చేస్తున్నారని, దీనిపై ఆర్య త్వరగా దృష్టి పెట్టాలని సూచించారు.
“ప్రియాంశ్ ఆర్య తన తప్పుల నుంచి నేర్చుకోవాలి. సీనియర్ ఆటగాళ్లు, మాజీలు ఇచ్చే సలహాలను వినాలి. లేదంటే పదే పదే అదే తప్పులు పునరావృతమవుతాయి. జట్టులోని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల సహాయం తీసుకుని, తన షార్ట్ బాల్ బలహీనతను అధిగమించాలి. అతనిలో టాలెంట్కు కొరత లేదు, కానీ సమస్యను గుర్తించి సరిదిద్దుకోవడం ముఖ్యం” అని తివారీ క్రిక్బజ్ చర్చలో వ్యాఖ్యానించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
7000 పరుగుల మైలురాయి దాటిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్
మరోవైపు.. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. వరుసగా ఆరు ఓటముల తర్వాత లభించిన ఈ విజయంపై అయ్యర్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ టీ20 క్రికెట్లో 7,000 పరుగుల మైలురాయిని కూడా విజయవంతంగా అధిగమించాడు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం అయ్యర్ మాట్లాడుతూ.. “ఈ సీజన్లో నా మొదటి సెంచరీ చేయడం, అది కూడా వరుస ఓటముల తర్వాత జట్టును గెలిపించడం చాలా ఆనందంగా ఉంది. మా ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబయి ఇండియన్స్ (MI) జట్టు రాజస్థాన్పై గెలవాలి. కాబట్టి తాము ముంబయికి మద్దతు ఇస్తాము” అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసులో తదుపరి సమీకరణాలపై ఆశలు నిలుపుకుంది.
తాజావార్తలు
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!