Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: సన్రైజర్స్ హైదరాబాద్(SRH) విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ(135) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 47 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఈ సెంచరీతో అభిషేక్ శర్మ భారత క్రికెట్ దిగ్గజాల రికార్డులను సమం చేయడమే కొన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ సమం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ చెరో 9 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్తో టీ20ల్లో 8 సెంచరీలు ఉన్న ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మను అభిషేక్ అధిగమించాడు. 25 ఏళ్ల ప్రాయంలోనే ఇలాంటి భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ, భారత క్రికెట్ భవిష్యత్తు సూపర్ స్టార్ తనేనని మరోసారి నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 135 పరుగులు సాధించాడు అభి.
READ MORE: Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఈ మెరుపు ఇన్నింగ్స్లో అభిషేక్ 7 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రస్తుత సీజన్లో మూడంకెల స్కోరును అందుకున్న నాలుగో బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు సీఎస్కే తరపున సంజూ శామ్సన్, ముంబై ఇండియన్స్ తరపున క్వింటన్ డికాక్, తిలక్ వర్మలు ఈ ఘనత సాధించారు. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్లో అభిషేక్ ఇన్నింగ్స్ ఆద్యంతం విధ్వంసకరంగా సాగింది. ఒకవైపు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (26 బంతుల్లో 37 పరుగులు) ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేక ఇబ్బంది పడుతున్నా, అభిషేక్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 53 బంతుల్లోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో అభిషేక్ వాటానే 58 పరుగులు ఉండటం విశేషం. ఈ ధాటి వల్లే సన్రైజర్స్ పవర్ప్లే ముగిసేసరికి 67 పరుగులు చేయగలిగింది.
READ MORE: Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..
తొమ్మిదో ఓవర్లో హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ మరింత ఉగ్రరూపం దాల్చాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 25 పరుగులు) క్రీజులోకి వచ్చి తన వంతుగా మెరుపులు మెరిపిస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నితీష్ రాణా వేసిన మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన అభిషేక్ 104 పరుగుల మార్కును చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ కాగా, హెన్రిచ్ క్లాసెన్ జత కలిశాడు. ఈ సెంచరీతో అప్పటివరకు క్లాసెన్ వద్ద ఉన్న ఆరెంజ్ క్యాప్ను అభిషేక్ తన సొంతం చేసుకున్నాడు. చివర్లో అభిషేక్-క్లాసెన్ జోడీ ఢిల్లీ బౌలర్లను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించి సన్రైజర్స్కు భారీ స్కోరును అందించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?