Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- కొండెక్కిన చక్కెర ధర
- కీలక పండుగల వేళ ధరలకు రెక్కలు
- కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చక్కెర ధరలు కొండెక్కుతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో పంచదార ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో రూ.65కు పెరిగిపోయింది. ఇక మహారాష్ట్రలో ఎక్స్-మిల్ చక్కెర ధరలు క్వింటాల్కు రూ.5,400 నుంచి రూ.5,560కి పెరిగింది. పైగా దేశంలో చక్కెర నిల్వలు కూడా అయిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో వ్యాపారులు కూడా బల్క్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లకు సిద్ధపడుతుండడంతో ఉన్న నిల్వలు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గిపోవడం, ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పండుగల సీజన్ ముందు వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురువారం ముడి చక్కెర దిగుమతి విధానంలో మార్పులు చేసింది. టారిఫ్ రేట్ కోటా కింద 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. టారిఫ్ రేట్ కోటా విధానంలో నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను తక్కువ లేదా సున్నా కస్టమ్స్ డ్యూటీతో దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ డ్యూటీ ఫ్రీ దిగుమతుల పరిమితిని 10 లక్షల టన్నులుగా నిర్ణయించారు. ఈ అవకాశం 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దేశంలో చక్కెర ధరలు కేవలం రెండు నెలల్లోనే దాదాపు 40 శాతం పెరిగాయి. దేశీయంగా సరఫరాలు తగ్గిపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వినియోగదారులపై మరింత భారం మోపే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను వినియోగించే దేశం భారత్. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరాలను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతుల మార్గాన్ని ఎంచుకుంది.
దేశీయ మార్కెట్లో చక్కెర ధరలను తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర వ్యాపారులు, డీలర్లపై స్టాక్ పరిమితులను విధించింది. చక్కెరను అక్రమంగా నిల్వ చేయడం, ఊహాజనిత ట్రేడింగ్ను అడ్డుకోవడంతో పాటు మార్కెట్లో తగినంత సరఫరా ఉండేలా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- Tags
- india
- market
- Sugar
- SUGAR PRICE HIKE
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!