Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?
- చర్చలు విఫలం.. సమ్మెకు జేఏసీ గ్రీన్ సిగ్నల్
- వేతనాలు, బకాయిలపై నిలిచిన డెడ్లాక్
- అర్థరాత్రి నుంచి బస్సులు బంద్.. ప్రయాణికులకు కష్టాలు
- ప్రభుత్వ తదుపరి చర్యలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరింది. సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కార్మిక సంఘాలు తమ సమ్మె నిర్ణయానికే మొగ్గు చూపాయి. దీంతో ముందస్తుగా ప్రకటించినట్లుగానే ఈరోజు అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది.
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీతో జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. ప్రధానంగా వేతన సవరణ, పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల, కార్మికుల సంక్షేమం వంటి పలు అంశాలను జేఏసీ ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. చర్చల అనంతరం బయటకు వచ్చిన జేఏసీ నాయకులు, ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే సమ్మెకు వెళ్లక తప్పడం లేదని స్పష్టం చేశారు.
చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలోని కార్మికులను అప్రమత్తం చేసింది. అర్థరాత్రి ప్రారంభమయ్యే మొదటి షిఫ్ట్ నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. కార్మికులంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నేతలు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు , డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించే అవకాశం కనిపిస్తోంది.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
అర్థరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు , సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగలు లేదా రద్దీ సమయాల్లో ఇలా సమ్మెకు వెళ్లడం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!