Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?
- చర్చలు విఫలం.. సమ్మెకు జేఏసీ గ్రీన్ సిగ్నల్
- వేతనాలు, బకాయిలపై నిలిచిన డెడ్లాక్
- అర్థరాత్రి నుంచి బస్సులు బంద్.. ప్రయాణికులకు కష్టాలు
- ప్రభుత్వ తదుపరి చర్యలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరింది. సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కార్మిక సంఘాలు తమ సమ్మె నిర్ణయానికే మొగ్గు చూపాయి. దీంతో ముందస్తుగా ప్రకటించినట్లుగానే ఈరోజు అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది.
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
Also Read
- Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
- Faculty Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..
కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీతో జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. ప్రధానంగా వేతన సవరణ, పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల, కార్మికుల సంక్షేమం వంటి పలు అంశాలను జేఏసీ ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. చర్చల అనంతరం బయటకు వచ్చిన జేఏసీ నాయకులు, ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే సమ్మెకు వెళ్లక తప్పడం లేదని స్పష్టం చేశారు.
చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలోని కార్మికులను అప్రమత్తం చేసింది. అర్థరాత్రి ప్రారంభమయ్యే మొదటి షిఫ్ట్ నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. కార్మికులంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నేతలు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు , డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించే అవకాశం కనిపిస్తోంది.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
అర్థరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు , సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగలు లేదా రద్దీ సమయాల్లో ఇలా సమ్మెకు వెళ్లడం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
తాజావార్తలు
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!