Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?
- చర్చలు విఫలం.. సమ్మెకు జేఏసీ గ్రీన్ సిగ్నల్
- వేతనాలు, బకాయిలపై నిలిచిన డెడ్లాక్
- అర్థరాత్రి నుంచి బస్సులు బంద్.. ప్రయాణికులకు కష్టాలు
- ప్రభుత్వ తదుపరి చర్యలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరింది. సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కార్మిక సంఘాలు తమ సమ్మె నిర్ణయానికే మొగ్గు చూపాయి. దీంతో ముందస్తుగా ప్రకటించినట్లుగానే ఈరోజు అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది.
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీతో జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. ప్రధానంగా వేతన సవరణ, పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల, కార్మికుల సంక్షేమం వంటి పలు అంశాలను జేఏసీ ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. చర్చల అనంతరం బయటకు వచ్చిన జేఏసీ నాయకులు, ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే సమ్మెకు వెళ్లక తప్పడం లేదని స్పష్టం చేశారు.
చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలోని కార్మికులను అప్రమత్తం చేసింది. అర్థరాత్రి ప్రారంభమయ్యే మొదటి షిఫ్ట్ నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. కార్మికులంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నేతలు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు , డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించే అవకాశం కనిపిస్తోంది.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
అర్థరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు , సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగలు లేదా రద్దీ సమయాల్లో ఇలా సమ్మెకు వెళ్లడం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
తాజావార్తలు
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..