IPL 2026 Playoffs: 22 రోజులు టాప్లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్గా ఉండి ప్లేఆఫ్స్కు అర్హత!
- అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన పీబీకేఎస్
- వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్
- చివరకు ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోయిన పంజాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings IPL 2026 Points Table: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసి వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 22 రోజుల పాటు టాప్లో కొనసాగిన పంజాబ్.. చివరకు ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టైటిల్ ఫేవరెట్గా కనిపించిన పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓటమిపాలై తీవ్ర ఒత్తిడిలో పడింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించినప్పటికీ.. 14 మ్యాచ్ల్లో 15 పాయింట్లతో ఐదో స్థానంలోనే నిలిచి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్లో ఎక్కువ రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన జట్లలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 18 రోజులు టాప్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ 13 రోజులు, సన్రైజర్స్ హైదరాబాద్ 4 రోజులు అగ్రస్థానంలో నిలిచాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక రోజు మాత్రమే టేబుల్ టాపర్గా ఉన్నప్పటికీ.. చివరకు రెండో స్థానంతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఇక ఇప్పుడు అందరి దృష్టి క్వాలిఫయర్-1పై పడింది. ఈరోజు ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం లభించనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ అదరగొట్టింది. దూకుడైన బ్యాటింగ్, పటిష్టమైన బౌలింగ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్లో ఉండగా.. జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అవే మ్యాచ్ల్లో గెలిచే సామర్థ్యం ఆర్సీబీకి అదనపు బలంగా మారింది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో బౌలింగ్ బలంతోనే ప్లేఆఫ్స్కు చేరుకుంది. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతితో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగా.. రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్ మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేశారు. బ్యాటింగ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించారు. చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 89 పరుగుల భారీ విజయంతో జీటీ మంచి జోరులో ఉంది. రెండు సమాన బలాలున్న జట్లు తలపడుతుండటంతో క్వాలిఫయర్-1 అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్గా మారే అవకాశముంది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!