CSK vs RCB : ఆర్సీబీని ఎగతాళి చేసిన సీఎస్కే మాజీ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫైర్
- మార్చి 28న సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్
- హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీని ఎగతాళి చేసిన బద్రీనాథ్
- వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్
- ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అంటే మాములుగా ఉండదు. మా టీమ్ బెస్ట్ అంటే.. మా టీమ్ బెస్ట్ అంటూ అభిమానులు కామెంట్స్ చేసుకుంటారు. ఈ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆ టీమ్ ఫ్యాన్స్కే కాకుండా.. క్రికెట్ అభిమానులకు కూడా ఎంతో ఆసక్తి. కాగా.. ఐపీఎల్ 2025లో మార్చి 28న చెన్నైలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు బద్రీనాథ్ తన ఫన్నీ వీడియోతో ఇరకాటంలో పడ్డాడు. ఈ వీడియోలో వివిధ జట్ల ప్రతినిధులతో కరచాలనం చేయడం.. హగ్ చేసుకోవడం కనిపించింది. అయితే ఆర్సీబీ ప్రతినిధి వంతు వచ్చినప్పుడు బద్రీనాథ్ అతన్ని పూర్తిగా అవహేళన చేస్తూ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆర్సీబీపై సెటైరికల్ కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు. బద్రీనాథ్ చేసిన ఈ చర్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: High Court: “సంపాదించే సామర్థ్యం ఉన్న మహిళలు భరణం అడగకూడదు..”
చెన్నై-బెంగళూరు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ హై-వోల్టేజ్ స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా అభిమానులకు అద్భుతమైన క్రికెట్ అనుభూతిని అందిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ధోనీ నేతృత్వంలో ఐదు టైటిళ్లు సాధించిన సీఎస్కే.. 2011లో ఫైనల్లో ఆర్సీబీని ఓడించి, వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది. ఆర్సీబీ విషయానికి వస్తే ఎప్పుడూ స్టార్లతో నిండిన జట్టుగా కనిపించినా.. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ను కూడా గెలుచుకోలేకపోయింది. 2009, 2011, 2016లలో మాత్రమే ఆర్సీబి ఫైనల్కు చేరింది. 2016లో కోహ్లీ కెప్టెన్సీలో ఆఖరి అవకాశం వచ్చినా. ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో RCB కొత్త కెప్టెన్ రాజత్ పాటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. కొత్త జట్టుతో ఆర్సీబీ బలంగా పోటీ ఇస్తుందా? లేదా మళ్లీ అదే కథ?ను రిపీట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!