Arshdeep Singh: భారీ షాకిచ్చిన అర్ష్దీప్ సింగ్.. విరాట్ కోహ్లీ వైరల్ వీడియో కూడా డిలీట్!
- ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన
- దారుణంగా అర్ష్దీప్ సింగ్ ప్రదర్శన
- కోహ్లీ వైరల్ వీడియోను డిలీట్ చేసిన అర్ష్దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Deletes Instagram Posts: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) దారుణ ప్రదర్శన చేసింది. మొదటి 7 మ్యాచ్లలో అపజయమే లేని పీబీకేఎస్ ఆపై వరుస ఓటములను ఎదుర్కొని.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ జట్టుపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీబీకేఎస్ స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీసుకోగా.. ఎకానమీ రేట్ 10కు పైగానే నమోదైంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అర్ష్దీప్ సోషల్ మీడియాలో చేసిన ఓ పని అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టులను తొలగించాడు. కొన్ని రోజుల క్రితం వరకు అతడి అకౌంట్లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం కేవలం 44 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి చేసిన వైరల్ రీల్ కూడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత ఏడాది డిసెంబర్లో అర్ష్దీప్, కోహ్లీ కలిసి చేసిన సరదా వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ రీల్కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ వీడియోలో అర్ష్దీప్.. ‘పాజీ, టార్గెట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటే సెంచరీ ఖాయంగా వచ్చేది’ అంటూ కోహ్లీతో సరదాగా అన్నాడు. దీనికి కోహ్లీ నవ్వుతూ.. ‘టాస్ మేం గెలవడం నీ అదృష్టం. లేదంటే డ్యూ పరిస్థితుల్లో నిన్ను కూడా బాగా కొట్టేవాళ్లు’ అంటూ చమత్కరించాడు. ఈ సరదా సంభాషణ అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయింది.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
అయితే ఇప్పుడు ఆ వీడియోతో పాటు పలు పోస్టులు కూడా అర్ష్దీప్ సింగ్ అకౌంట్ నుంచి మాయమయ్యాయి. దీనికి గల అసలు కారణం ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల సోషల్ మీడియా పోస్టులపై ఫ్రాంచైజీ కఠిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపై ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు, కంటెంట్ను కేవలం ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే పోస్టు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై జట్టు వర్గాలు స్పందిస్తూ.. ‘బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఆటగాళ్లు గౌరవించాలి. ట్రైనింగ్ అనంతరం సీఈఓ ఆటగాళ్లతో మాట్లాడి కొత్త నిబంధనలను వివరించనున్నారు’ అని తెలిపాయి. దీంతో అర్ష్దీప్ సోషల్ మీడియా క్లీనప్ వెనుక ఇదే కారణమా? అన్న చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సాగుతోంది.
తాజావార్తలు
-
Avor Electric Bike: అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. 260KM రేంజ్, 114Kmph టాప్ స్పీడ్! ధర, ఫీచర్లు ఇవే!
-
Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్తో కట్టిపడేసిన మేకర్స్
-
YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
-
Earthquake: మహారాష్ట్ర నాసిక్లో భూకంపం…
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్కు రజతం, దిలీప్ గావిత్కు స్వర్ణం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!