IPL 2022: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్థాన్కే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను మాత్రం రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ 863 పరుగులు సాధించి ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా బట్లర్కే దక్కింది. అంతేకాకుండా అత్యధిక ఫోర్లు (83), అత్యధిక సిక్సర్లు (45) కొట్టిన రికార్డు కూడా బట్లర్నే వరించింది. పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అతడికే దక్కింది.
IPL 2022: ఆర్సీబీ కొంప ముంచిన రిటైన్ ఆటగాళ్లు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
మరోవైపు ఈ సీజన్లో 27 వికెట్లు తీసిన చాహల్ పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ సొంతం చేసుకున్నాడు. అతడు 13 మ్యాచ్లలో కలిపి 22 వికెట్లు తీశాడు. 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి మెప్పించడంతో త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికయ్యాడు. అటు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ఎవిన్ లూయిస్కు దక్కింది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రింకూ సింగ్ క్యాచ్ను ఒంతిచేత్తో అద్భుతంగా అందుకోవడంతో లూయిస్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. కాగా సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డును బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దినేష్ కార్తీక్ గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 183.33 స్ట్రయిక్ రేటును దినేష్ కార్తీక్ నమోదు చేశాడు. చివరగా ఫెయిర్ ప్లే అవార్డు మాత్రం రాజస్థాన్ జట్టును వరించింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!