IPL 2022: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్థాన్కే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను మాత్రం రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ 863 పరుగులు సాధించి ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా బట్లర్కే దక్కింది. అంతేకాకుండా అత్యధిక ఫోర్లు (83), అత్యధిక సిక్సర్లు (45) కొట్టిన రికార్డు కూడా బట్లర్నే వరించింది. పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అతడికే దక్కింది.
IPL 2022: ఆర్సీబీ కొంప ముంచిన రిటైన్ ఆటగాళ్లు
Also Read
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
మరోవైపు ఈ సీజన్లో 27 వికెట్లు తీసిన చాహల్ పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ సొంతం చేసుకున్నాడు. అతడు 13 మ్యాచ్లలో కలిపి 22 వికెట్లు తీశాడు. 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి మెప్పించడంతో త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికయ్యాడు. అటు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ఎవిన్ లూయిస్కు దక్కింది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రింకూ సింగ్ క్యాచ్ను ఒంతిచేత్తో అద్భుతంగా అందుకోవడంతో లూయిస్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. కాగా సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డును బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దినేష్ కార్తీక్ గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 183.33 స్ట్రయిక్ రేటును దినేష్ కార్తీక్ నమోదు చేశాడు. చివరగా ఫెయిర్ ప్లే అవార్డు మాత్రం రాజస్థాన్ జట్టును వరించింది.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!