IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి రోజున ఐపీఎల్ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేలంలో ఎవరు.. ఏ ధరకు కొనుగోలు అయ్యారో తెలుసుకుందాం. ఐపీఎల్లో అత్యధిక ఐదుసార్లు టైటిల్ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్. ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్ కిషన్తోపాటు ఫిట్నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం 42 కోట్లను కేటాయించింది.
రోహిత్కు 16 కోట్లు, బుమ్రా 12, సూర్యకుమార్ యాదవ్ 8 కోట్లు, పొలార్డ్ 6 కోట్లకుతో రిటెయిన్ చేసుకుంది. నాలుగు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్కు ధోనీకి విడదీయరాని బంధం ఉంది. ఈసారి కూడా సీఎస్కే ధోనీని రిటెయిన్ చేసుకుంది. ధోనీతో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీను అట్టపెట్టుకుంది. ధోనీ కోసం 12 కోట్లు కేటాయించిన సీఎస్కే.. జడేజాకు 16 కోట్లు, మొయిన్ అలీకి 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్కు 6 కోట్లు కేటాయించింది.
Also Read
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
- Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
కోల్కత్తా నైట్ రైడర్స్…సునీల్ నరైన్ 6 కోట్లు, ఆండ్రూ రస్సెల్ 12 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ 8 కోట్లు, వరుణ్ చక్రవర్తి 8 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. శుభ్మన్ గిల్ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపొచ్చు. నలుగురు ఆటగాళ్ల కోసం 34 కోట్లు కేటాయించింది. కెప్టెన్ ఇయన్ మోర్గాన్ను వదిలేసింది. ఢిల్లీ కేపిటల్స్… కెప్టెన్ రిషభ్ పంత్ 16 కోట్లు, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 9 కోట్లు, ఓపెనర్ పృథ్వీ షా 7.5 కోట్లు, పేస్ బౌలర్ ఎన్రిచ్ నార్జ్ 6.5 కోట్లు పెట్టి తమ వద్దే ఉంచుకుంది. ఆర్సీబీ… కోహ్లీ 15 కోట్లు, మ్యాక్స్వెల్ 11 కోట్లు, మహమ్మద్ సిరాజ్ 7 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ముగ్గురు ప్లేయర్ల కోసం 33 కోట్లను ఖర్చు చేసింది. మిగతా జట్టు కోసం 57 కోట్లను కేటాయించనుంది. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్ను అట్టిపెట్టుకుంది. మయాంక్కు 12 కోట్లు, అర్ష్దీప్కు 4 కోట్లతో రిటెయిన్ చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు 14 కోట్లు, అబ్దుల్ సమద్ 4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ 4 కోట్లు పెట్టింది. ముగ్గురు ఆటగాళ్ల కోసం 22 కోట్లు ఖర్చు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు…కెప్టెన్ సంజూ శాంసన్ 14 కోట్లు, బట్లర్ 10 కోట్లు, జైశ్వాల్ 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.
- Tags
- CSK
- ipl 2022
- IPL Retention
- mumbai
తాజావార్తలు
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!