IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ ఒంటరి పోరు.. ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won First ODI In Wakhande Against Australia: వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 188 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాస్త కష్టంగానే చేధించింది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో భారత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాపార్డర్ ఘోరంగా విఫలమై, భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగినప్పుడు.. నేనున్నానంటూ కేఎల్ రాహుల్ ఒంటిచేత్తో పోరాడి గెలిపించాడు. అతనికి హార్దిక్ పాండ్యా (25), రవీంద్ర జడేజా (45) మద్దతు తెలపడంతో.. టీమిండియా నెగ్గగలిగింది. ఇంకా పది ఓవర్లు మిగిలుండగానే.. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయఢంకా మోగించింది.
TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
- Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
తొలుత భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. ఒక్క మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా ఆసీస్ బ్యాటర్లు భారత బౌలర్ల ప్రతాపం ముందు నిలబడలేకపోవడంతో.. ఆసీస్ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది. 189 పరుగుల లక్ష్యం చిన్నదే కాబట్టి.. భారత్ సునాయాసంగా చేధిస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలకు భిన్నంగా టాపార్డర్ గట్టి షాక్ ఇచ్చింది. ఇషాన్ కిషన్ (3), శుభ్మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్య కుమార్ యాదవ్ (0) చేతులు ఎత్తేయడంతో.. భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో.. భారత్ లక్ష్యాన్ని చేధించగలుగుతుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది.
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక.. అతడే కీలక సూత్రధారి
అలాంటి కష్ట సమయంలో రంగంలోకి దిగిన భారత్.. పునాదిలాగా నిల్చుండిపోయాడు. ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా, ఆచితూచి ఆడుతూ జట్టుని ముందుకు నడిపించాడు. తొలుత హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్ని గాడిలో పెట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి.. భారత్ని విజయతీరాలకు చేర్చాడు. చివర్లో జడేజా సైతం విజృంభించడంతో, 10.1 ఓవర్లు మిగిలుండగానే భారత్ 191 పరుగులు చేసి, మ్యాచ్ని కైవసం చేసుకుంది. ఏదేమైనా.. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ‘హీరో’గా నిలిచాడు. సరైన సమయంలో హుందాగా ఆడి, తన సత్తా చాటాడు.
తాజావార్తలు
-
NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
-
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్ను అడ్డుకున్న కార్యకర్తలు!
-
Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ “ధర్మక్షేత్ర” ముస్తాబు!
-
Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
-
Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్కి
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!