IND vs SL 3rd T20I: శ్రీలంకపై ఘనవిజయం.. భారత్దే టీ20 సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won 3rd T20I Match Against Sri Lanka: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన భారీ లక్ష్యంతో (229) బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 91 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, బౌలింగ్లో బౌలర్లందరూ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం వల్లే.. భారత్ ఈ ఘనవిజయాన్ని సాధించగలిగింది. ఫలితంగా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ అదిరిపోయే రికార్డు.. టీ20 హిస్టరీలోనే తొలి ఆటగాడు
Also Read
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నిజానికి.. బరిలోకి దిగిన వెంటనే భారత్కి గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే 3 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (35) కాసేపు లంక బౌలర్లకి చుక్కలు చూపించారు. శుబ్మన్ గిల్తో కలిసి 49 భాగస్వామ్యాన్ని జోడించాడు. రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అయితే తాండవం చేశాడు. వీడియో గేమ్ తరహాలోనే ఇతడు 360 డిగ్రీ ఆటతో పరుగుల వర్షం కురిపించాడు. శ్రీలంక బౌలర్లు ఔట్ చేసేందుకు ఎంతటి క్లిష్టమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో అతడు 51 బంతుల్లోనే 9 సిక్స్లు, 7 ఫోర్ల సహాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ (21) కూడా రప్ఫాడించడంతో.. భారత్ 228 పరుగులు చేయగలిగింది.
Minister Roja: నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది?
ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. మొదట్లో చితక్కొట్టేసింది. మన భారత బౌలర్లు కూడా ఉచితంగా పరుగులు సమర్పించుకోవడంతో, శ్రీలంక స్కోర్ బోర్డు బాగానే పరుగులు పెట్టింది. అయితే.. ఆ తర్వాత భారత బౌలర్లు తిరిగి గాడిలోకి వచ్చి, కట్టడి చేశారు. లంక బ్యాటర్లకు పరుగులు కొట్టే అవకాశం ఇవ్వకుండా, వరుసగా వికెట్లు తీశారు. దీంతో.. 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంకలో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. బౌలర్ల విషయానికొస్తే.. అర్ష్దీప్ 3 వికెట్లు తీయగా, ఉమ్రాన్, చాహల్, పాండ్యా చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!