IND vs SL 3rd T20I: శ్రీలంకపై ఘనవిజయం.. భారత్దే టీ20 సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won 3rd T20I Match Against Sri Lanka: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన భారీ లక్ష్యంతో (229) బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 91 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, బౌలింగ్లో బౌలర్లందరూ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం వల్లే.. భారత్ ఈ ఘనవిజయాన్ని సాధించగలిగింది. ఫలితంగా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ అదిరిపోయే రికార్డు.. టీ20 హిస్టరీలోనే తొలి ఆటగాడు
Also Read
- Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నిజానికి.. బరిలోకి దిగిన వెంటనే భారత్కి గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే 3 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (35) కాసేపు లంక బౌలర్లకి చుక్కలు చూపించారు. శుబ్మన్ గిల్తో కలిసి 49 భాగస్వామ్యాన్ని జోడించాడు. రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అయితే తాండవం చేశాడు. వీడియో గేమ్ తరహాలోనే ఇతడు 360 డిగ్రీ ఆటతో పరుగుల వర్షం కురిపించాడు. శ్రీలంక బౌలర్లు ఔట్ చేసేందుకు ఎంతటి క్లిష్టమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో అతడు 51 బంతుల్లోనే 9 సిక్స్లు, 7 ఫోర్ల సహాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ (21) కూడా రప్ఫాడించడంతో.. భారత్ 228 పరుగులు చేయగలిగింది.
Minister Roja: నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది?
ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. మొదట్లో చితక్కొట్టేసింది. మన భారత బౌలర్లు కూడా ఉచితంగా పరుగులు సమర్పించుకోవడంతో, శ్రీలంక స్కోర్ బోర్డు బాగానే పరుగులు పెట్టింది. అయితే.. ఆ తర్వాత భారత బౌలర్లు తిరిగి గాడిలోకి వచ్చి, కట్టడి చేశారు. లంక బ్యాటర్లకు పరుగులు కొట్టే అవకాశం ఇవ్వకుండా, వరుసగా వికెట్లు తీశారు. దీంతో.. 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంకలో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. బౌలర్ల విషయానికొస్తే.. అర్ష్దీప్ 3 వికెట్లు తీయగా, ఉమ్రాన్, చాహల్, పాండ్యా చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!