IND vs SL 3rd T20I: శ్రీలంకపై ఘనవిజయం.. భారత్దే టీ20 సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won 3rd T20I Match Against Sri Lanka: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన భారీ లక్ష్యంతో (229) బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 91 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, బౌలింగ్లో బౌలర్లందరూ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం వల్లే.. భారత్ ఈ ఘనవిజయాన్ని సాధించగలిగింది. ఫలితంగా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ అదిరిపోయే రికార్డు.. టీ20 హిస్టరీలోనే తొలి ఆటగాడు
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నిజానికి.. బరిలోకి దిగిన వెంటనే భారత్కి గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే 3 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (35) కాసేపు లంక బౌలర్లకి చుక్కలు చూపించారు. శుబ్మన్ గిల్తో కలిసి 49 భాగస్వామ్యాన్ని జోడించాడు. రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అయితే తాండవం చేశాడు. వీడియో గేమ్ తరహాలోనే ఇతడు 360 డిగ్రీ ఆటతో పరుగుల వర్షం కురిపించాడు. శ్రీలంక బౌలర్లు ఔట్ చేసేందుకు ఎంతటి క్లిష్టమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో అతడు 51 బంతుల్లోనే 9 సిక్స్లు, 7 ఫోర్ల సహాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ (21) కూడా రప్ఫాడించడంతో.. భారత్ 228 పరుగులు చేయగలిగింది.
Minister Roja: నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది?
ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. మొదట్లో చితక్కొట్టేసింది. మన భారత బౌలర్లు కూడా ఉచితంగా పరుగులు సమర్పించుకోవడంతో, శ్రీలంక స్కోర్ బోర్డు బాగానే పరుగులు పెట్టింది. అయితే.. ఆ తర్వాత భారత బౌలర్లు తిరిగి గాడిలోకి వచ్చి, కట్టడి చేశారు. లంక బ్యాటర్లకు పరుగులు కొట్టే అవకాశం ఇవ్వకుండా, వరుసగా వికెట్లు తీశారు. దీంతో.. 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంకలో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. బౌలర్ల విషయానికొస్తే.. అర్ష్దీప్ 3 వికెట్లు తీయగా, ఉమ్రాన్, చాహల్, పాండ్యా చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!