IND Vs SL: నేటి నుంచి వన్డే సిరీస్.. టీమిండియా బోణీ కొట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SL: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను గెలుచుకున్న టీమిండియా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ మేరకు గౌహతిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు మూడు వన్డేల సిరీస్లో ఆడనున్నారు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రతి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఆటతీరు ఎలా ఉంటుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also: Keerthy Suresh : గ్లామర్ డోస్ పెంచిన మహానటి
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
ఈ వన్డే సిరీస్లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పరిస్థితి అయోమయంగా మారింది. కేఎల్ రాహుల్ రావడంతో అతడికి జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. రోహిత్ ఎవరిని తీసుకుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు వన్డేల్లో కేఎల్ రాహుల్కు తిరుగులేదు. ముఖ్యంగా 2019, 2020, 2021లో అతడు పరుగుల వరద పారించాడు. గతేడాది నుంచి నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. 2022లో 10 మ్యాచ్లు ఆడిన రాహుల్ 27.89 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అటు మిడిలార్డర్ ఫుల్ ప్యాకప్గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. అటు బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, మహ్మద్ షమీ, అర్ష్దీప్, సిరాజ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!