India vs Western Australia: ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం.. దేశవాళీ జట్టు చేతిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Lost Practice Match Against Wester Australia Team: రీసెంట్గా ఆడిన టీ20 సిరీస్లలో భారత బౌలింగ్ లైనప్ పేలవంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ పటిష్టంగా ఉండటంతో, ఆ సిరీస్లను కైవసం చేసుకోగలిగింది. దీంతో.. వరల్డ్కప్లో కూడా టీమిండియా మంచి ప్రదర్శనతో దూసుకెళ్తుందన్న నమ్మకాలు క్రీడాభిమానుల్లో నెలకొన్నాయి. అయితే.. ఇప్పుడా నమ్మకం సన్నగిల్లేలా కనిపిస్తోంది. అసలు భారత జట్టు వరల్డ్కప్లో నెట్టుకురాగలదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం.. ప్రాక్టీస్ మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూడటమే!
టీ20 వరల్డ్కప్కు సన్నద్ధమయ్యేందుకు భారత జట్టు కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే! అక్కడ టీమిండియాకు, దేశవాళీ క్రికెట్ జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించారు. దేశవాళీ జట్టే కదా.. భారత జట్టు చిత్తు చిత్తు చేస్తుందిలే అని భారతీయ అభిమానులు భావించారు. కానీ, అందుకు భిన్నంగా టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 36 పరుగుల తేడాతో ఆ దేశవాళీ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఒక్క కేఎల్ రాహుల్ మినహాయిస్తే.. మిగతా భారత బ్యాట్స్మన్లందరూ చేతులు ఎత్తేశారు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోలేక, వెనువెంటనే పెవిలియన్ చేరారు. అందుకే, సాధ్యమైన లక్ష్యాన్ని కూడా చేధించలేక భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
- IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టీమిండియా టాస్ గెలవగా, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్కి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ (64), డార్సీ షార్ట్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 169 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ ఒక్కడే 74 పరుగులతో రాణించాడు. మిగతా కీలక ఆటగాళ్లంతా భారీ స్కోర్లు చేయకపోవడంతో.. భారత్ ఓడింది. దీంతో.. భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి.
తాజావార్తలు
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!