Rohit Sharma: ఆ వేడుకల కోసం పాకిస్థాన్కు రోహిత్ శర్మ..?
- ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ..
- ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ టీమిండియా కెప్టెన్ హాజరవుతారా? లేదా?..
- ప్రారంభ వేడుకల్లో భారత సారథి పాల్గొంటారని బీసీసీఐ ప్రతినిధి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో.. ఒక వేళ భారత్ సెమీస్, ఫైనల్కు చేరినా అవన్నీ దుబాయ్లోనే కొనసాగనున్నాయి. అయితే, 1996 తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్లో ఆడేందుకే జట్టును పంపించబోమని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇప్పుడు కెప్టెన్ హోదాలో ఆ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ ప్రతినిధులు మాత్రం భారత కెప్టెన్ పాకిస్థాన్ వెళ్తాడని చెప్తున్నారు.
Also Read
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
ఇక, టీమిండియా సారథి పాకిస్థాన్కు వెళ్తాడు.. పీసీబీ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటాడు అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ ఆధ్వర్యంలో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ జరగబోతుందన్నారు. పాక్ కు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే.. భారత్ కెప్టెన్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు కొనసాగుతాయా? లేదా? అనేది వేచి చూడాలి. పాక్ మాత్రం తమ దేశంలోనే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పట్టుబట్టింది. పాక్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభంకానుంది. పాకిస్థాన్తో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్ పోటీ పడనుంది. ఇప్పటి వరకు భారత్, పాక్ మాత్రం తమ స్క్వాడ్లను వెల్లడించలేదు. జనవరి 19 నాటికి టీమ్స్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!