Rohit Sharma: ఆ వేడుకల కోసం పాకిస్థాన్కు రోహిత్ శర్మ..?
- ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ..
- ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ టీమిండియా కెప్టెన్ హాజరవుతారా? లేదా?..
- ప్రారంభ వేడుకల్లో భారత సారథి పాల్గొంటారని బీసీసీఐ ప్రతినిధి వెల్లడి
Rohit Sharma: 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో.. ఒక వేళ భారత్ సెమీస్, ఫైనల్కు చేరినా అవన్నీ దుబాయ్లోనే కొనసాగనున్నాయి. అయితే, 1996 తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్లో ఆడేందుకే జట్టును పంపించబోమని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇప్పుడు కెప్టెన్ హోదాలో ఆ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ ప్రతినిధులు మాత్రం భారత కెప్టెన్ పాకిస్థాన్ వెళ్తాడని చెప్తున్నారు.
Also Read
- IPL 2026: "ఇక 350 కొడితేనే సేఫ్".. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
- Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
ఇక, టీమిండియా సారథి పాకిస్థాన్కు వెళ్తాడు.. పీసీబీ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటాడు అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ ఆధ్వర్యంలో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ జరగబోతుందన్నారు. పాక్ కు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే.. భారత్ కెప్టెన్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు కొనసాగుతాయా? లేదా? అనేది వేచి చూడాలి. పాక్ మాత్రం తమ దేశంలోనే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పట్టుబట్టింది. పాక్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభంకానుంది. పాకిస్థాన్తో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్ పోటీ పడనుంది. ఇప్పటి వరకు భారత్, పాక్ మాత్రం తమ స్క్వాడ్లను వెల్లడించలేదు. జనవరి 19 నాటికి టీమ్స్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!