IND vs SA: నేడే తొలి వన్డే.. చాన్నాళ్ల తర్వాత బరిలోకి రో-కో! గంబీర్కు ప్రియమైన వ్యక్తికి చోటు
- భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడే తొలి వన్డే
- చాన్నాళ్ల తర్వాత బరిలోకి రో-కో
- గంబీర్కు ప్రియమైన వ్యక్తికి చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆదివారం రాంచిలో తొలి వన్డే మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురై తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్న టీమిండియా.. వన్డే సిరీస్ అయినా గెలవాలని చూస్తోంది. ఏడాదికి పైగా విరామం తర్వాత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. దాంతో అందరి దృష్టీ రో-కోల పైనే ఉంది. ఈ ఇద్దరు ఎలా ఆడుతారో చూడాలి.
గాయం కారణంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డే సిరీస్కు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. వన్డే జట్టులో నిలదొక్కుకోవాలని యశస్వి చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ మూడులో ఆడనుండగా.. నాలుగో స్థానం కోసం రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ నెలకొంది. రుతురాజ్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ లోకేష్ రాహుల్ అయిదో స్థానంలో ఆడతాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తాడు. నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్లో ఆడనున్నారు. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనున్నారు. కోచ్ గంబీర్కు ప్రియమైన వ్యక్తి హర్షిత్ ఎలా ఆడుతాడో చూడాలి. ఈ మ్యాచులో రాణించకుంటే విమర్శలు రావడం పక్కా.
Also Read
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్లో కూడా సత్తాచాటాలని చూస్తోంది. అయితే తుది జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. టెస్టులో ఆడిన తెంబా బవుమా, మార్క్రమ్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, కార్బిన్ బోష్లు ఈ సిరీస్లో ఆడనున్నారు. డికాక్, బ్రీట్జ్కే, బ్రెవిస్, రుబిన్ హెర్మన్ వన్డేల్లో ఆడనున్నారు. వీరందరూ భారత బౌలర్లకు సవాలు విసరడం ఖాయం. గాయం కారణంగా పేసర్ రబాడ దూరం అయినా సఫారీల బౌలింగ్ పటిష్టంగానే ఉంది. యాన్సెన్, బర్గర్, ఎంగిడి, బోష్లతో టీమిండియా బ్యాటర్లకు ముప్పు తప్పదు. కేశవ్, మార్క్రమ్ స్పిన్ బౌలింగ్ వేయనున్నారు.
రాంచిలో పిచ్ నెమ్మదిగా ఉంటుంది. ఇక్కడ 5 వన్డేలు జరగగా.. భారీ స్కోర్లు మాత్రం నమోదు కాలేదు. ఒక్కసారి మాత్రమే 300 ప్లస్ స్కోర్ నమోదైంది. ఈ రోజు కూడా మోస్తరు స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్లో 270-280 మంచి స్కోర్. ఇక 300 స్కోర్ అయితే దాదాపు విజయం సాధించినట్లే. రాంచిలో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. రాత్రి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, ఆర్ జడేజా, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా: మార్క్రమ్, డికాక్, బవుమా (కెప్టెన్), బ్రీట్జ్కే, బ్రెవిస్, రుబిన్ హెర్మన్, యాన్సెన్, బోష్, కేశవ్, బర్గర్, ఎంగిడి.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!