IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
- లార్డ్స్ వేదికగా జులై 19న మూడో వన్డే మ్యాచ్
- లార్డ్స్ వన్డే ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం
- ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Release Liam Dawson, Tom Banton: భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్రౌండర్ లియామ్ డాసన్, బ్యాటర్ టామ్ బాంటన్లను లార్డ్స్ వేదికగా జులై 19న జరగనున్న చివరి వన్డేకు ముందే జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరూ దేశవాళీ టీ20 బ్లాస్ట్ ఫైనల్లో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. డాసన్, బాంటన్ స్థానంలో కొత్త ఆటగాళ్లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేయలేదు.
మొదటి వన్డేలో లియామ్ డాసన్ అద్భుత హాఫ్ సెంచరీ (68)తో ఆకట్టుకున్నాడు. జో రూట్తో కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూపర్ నాక్ ఆడినా రెండో వన్డేలో తుది జట్టులో మాత్రం అతడికి అవకాశం దక్కలేదు. దీంతో తన కౌంటీ జట్టు హాంప్షైర్ తరఫున ఎస్సెక్స్పై జరిగిన టీ20 బ్లాస్ట్ క్వార్టర్ ఫైనల్ను ఆడలేకపోయాడు. మరోవైపు టామ్ బాంటన్కు సిరీస్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ విడుదల చేసి టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అనుమతించింది.
Also Read
- Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
- Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో తొలి సెమీఫైనల్లో సోమర్సెట్, నార్తాంప్టన్షైర్ స్టీల్బ్యాక్స్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో హాంప్షైర్ హాక్స్, నాట్స్ అవుట్లాస్ మధ్య పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్ల విజేతలు అదే రోజు సాయంత్రం ఎడ్జ్బాస్టన్లో జరిగే ఫైనల్లో ట్రోఫీ కోసం పోటీపడతాయి. లార్డ్స్ వన్డేకు ముందు ఇంగ్లండ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సమం చేసింది. కార్డిఫ్లో జరిగిన రెండో మ్యాచ్లో విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధశతకాలతో రాణించినా.. మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ 233 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లండ్కు అద్భుత విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!