ChampionsTrophy2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాక్తో ఐసీసీ కీలక భేటీ
- ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన ఐసీసీ
- హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకుంటారా.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తాం: ఐసీసీ
- నేడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఫైనల్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఐసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChampionsTrophy2025: ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ కోసం టీమిండియాను తమ దేశానికి ఎలాగైనా రప్పించాలని చూసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. పాక్కు వెళ్లే సమస్యే లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పడంతో.. భారత్ ఆడే మ్యాచ్లను వేరే తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకోవాలని.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అల్టిమేటం జారీ చేసింది. కానీ, పాకిస్థాన్ హైబ్రిడ్ పద్ధతికి తాము వ్యతిరేకమని ఐసీసీకి వెల్లడించింది.
Read Also: IND vs AUS BGT: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్.. భారత్కు అడ్వాంటేజ్ కానుందా
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
కాగా, ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది. పాక్ ఒప్పుకుంటే భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తుంది.
Read Also: Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహిస్తే.. ఐసీసీకి పైసా కూడా రాదు. ఆ విషయం పాక్ కు కూడా తెలుసు. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హైబ్రిడ్ మోడల్ కి ఒప్పుకుంటే సరే.. లేకపోతే పాకిస్థాన్ జట్టు లేకుండా యూఏఈ లేదా మరో దేశంలో ఈ టోర్నీని నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేస్తోందని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశానికి తరలిస్తే పాక్ రూ.296 కోట్లకు పైగా నష్టపోతుంది. అయితే, 2008 ముంబై దాడుల తర్వాత టీమిండియా పాక్లో పర్యటించలేదు.
Read Also: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
అయితే, పాకిస్థాన్లో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగాల్సిన టైంకి పరిస్థితులు మెరుగు పడతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితులు మారకపోతే.. వేరే దేశాలు కూడా పాక్కు వెళ్లడానికి ఇష్టపడవు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిపై పాకిస్థాన్ స్పందనను బట్టి.. ఐసీసీ ఇప్పుడే టోర్నమెంట్ ని మరో దేశానికి తరలిస్తే ఆశ్చర్యమేమీ లేదని ఐసీసీ బోర్డు సభ్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!