ChampionsTrophy2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాక్తో ఐసీసీ కీలక భేటీ
- ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన ఐసీసీ
- హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకుంటారా.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తాం: ఐసీసీ
- నేడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఫైనల్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఐసీసీ
ChampionsTrophy2025: ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ కోసం టీమిండియాను తమ దేశానికి ఎలాగైనా రప్పించాలని చూసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. పాక్కు వెళ్లే సమస్యే లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పడంతో.. భారత్ ఆడే మ్యాచ్లను వేరే తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకోవాలని.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అల్టిమేటం జారీ చేసింది. కానీ, పాకిస్థాన్ హైబ్రిడ్ పద్ధతికి తాము వ్యతిరేకమని ఐసీసీకి వెల్లడించింది.
Read Also: IND vs AUS BGT: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్.. భారత్కు అడ్వాంటేజ్ కానుందా
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
కాగా, ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది. పాక్ ఒప్పుకుంటే భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తుంది.
Read Also: Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహిస్తే.. ఐసీసీకి పైసా కూడా రాదు. ఆ విషయం పాక్ కు కూడా తెలుసు. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హైబ్రిడ్ మోడల్ కి ఒప్పుకుంటే సరే.. లేకపోతే పాకిస్థాన్ జట్టు లేకుండా యూఏఈ లేదా మరో దేశంలో ఈ టోర్నీని నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేస్తోందని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశానికి తరలిస్తే పాక్ రూ.296 కోట్లకు పైగా నష్టపోతుంది. అయితే, 2008 ముంబై దాడుల తర్వాత టీమిండియా పాక్లో పర్యటించలేదు.
Read Also: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
అయితే, పాకిస్థాన్లో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగాల్సిన టైంకి పరిస్థితులు మెరుగు పడతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితులు మారకపోతే.. వేరే దేశాలు కూడా పాక్కు వెళ్లడానికి ఇష్టపడవు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిపై పాకిస్థాన్ స్పందనను బట్టి.. ఐసీసీ ఇప్పుడే టోర్నమెంట్ ని మరో దేశానికి తరలిస్తే ఆశ్చర్యమేమీ లేదని ఐసీసీ బోర్డు సభ్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!