ICC: శ్రీలంక క్రికెట్పై నిషేధం ఎత్తేసిన ఐసీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC: శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)పై విధించిన సస్పెన్షన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడానికి ICC ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రోజు తక్షణమే శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. సస్సెన్షన్ నుంచి ఐసీసీ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఎల్సీ ఇకపై సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించదు’’ అని ప్రకటనలో పేర్కొంది.
Read Also: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో గందరగోళం.. ఎంపీల కొట్లాట.. వీడియో వైరల్..
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
నవంబర్ 2023లో శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగ్, అర్జున్ రణతుంగా నేతృత్వంలో మధ్యంతర కమిటీని ప్రవేశపెట్టిన తర్వాత, రాజకీయ జోక్యం కారణంగా ఐసీసీ శ్రీలంక క్రికెట్ని సస్పెండ్ చేసింది. భారతదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక జట్టు ఫెయిల్యూర్ తర్వాత శ్రీలంక క్రికెట్పై ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఇది ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సస్పెండ్ చేసింది.
క్రికెట్ ప్రపంచకప్ మొత్తం టోర్నీలో శ్రీలంక అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. 9 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్ని మాత్రమే గెలిచింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్లాట్ను కూడా కోల్పోయింది.
శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఐసీసీ బోర్డుకు చాలాసార్లు విజ్ఞప్తి చేయడంతో శ్రీలంక అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అనుమతించబడింది. ఐసీసీ బోర్డు నవంబర్ 21న సమావేశమై శ్రీలంక ద్వైపాక్షిక క్రికెట్, ఐసీసీ ఈవెంట్స్ లలో అంతర్జాతీయ పోటీ పడాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ శ్రీలంకలో జరగాల్సి ఉన్నా.. అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు తరలించారు. సస్పెన్షన్ తర్వాత, శ్రీలంక ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్కు ఆతిథ్యం ఇచ్చింది.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?