Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించే ఛాన్స్!
- నేడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును ప్రకటించే ఛాన్స్..
- గాయం నుంచి కోలుకున్న బుమ్రాను టీమ్ లోకి తీసుకునే అవకాశం..
- సంజూ శాంసన్కు బదులు కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయనున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు. అయితే, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐసీసీ టోర్నమెంట్లో ఆడడంపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు తెర పడింది.
Read Also: Lakshmi Parvathi: సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్!
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో బుమ్రాను చేర్చేందుకు బీసీసీఐ రెడీగా ఉందని సమాచారం. కాగా, సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఆడతాడా లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, బుమ్రా తన గాయంంపై వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
Read Also: Pro-Pakistan Slogan: సోషల్ మీడియాలో పాక్ అనుకూల నినాదాన్ని పోస్ట్ చేసిన యూపీ వ్యక్తి అరెస్ట్
అయితే, బుమ్రాను తుది జట్టులోకి తీసుకుంటారు.. కానీ, టోర్నీలో పాల్గొనడం అనేది మాత్రం అతని ఫిట్నెస్పై ఆధారపడింది. సెలక్టర్లు బుమ్రా ఫిట్నెస్ను అంచనా వేసేందుకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కనీసం ఒక మ్యాచ్ ఆడాలని కోరినట్లు తెలుస్తుంది. ఇక, సంజూ శాంసన్ కు జట్టులో చోటు దక్కించుకోలేకపోతాడని సమాచారం. ఎందుకంటే, సంజూకి ఇంగ్లండ్తో జరగబోయే టీ20లో చోటు దక్కించుకున్నప్పటికీ.. వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడ్ని ఎంపిక చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు.
Read Also: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
అయితే, జాతీయ జట్టుకు ఆడాలనుకునే ప్లేయర్స్ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చింది. కానీ, సంజూ శాంసన్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంతో సెలక్టర్లు అతని గైర్హాజరుపై సంతోషంగా లేరని తెలుస్తుంది. అలాగే, దేశవాళీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కరుణ్ నాయర్ ను జట్టులోకి తీసుకునేందుకు సెలక్షన్ కమిటీ యోచిస్తుంది. ఇప్పటి వరకు అతడు వీహెచ్టీలో 8 మ్యాచ్ల్లో 752 రన్స్ చేశాడు. ఏడు ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!