WTC 2023 Final: భారత్ ఫైనల్కు చేరాలంటే.. అది తప్పకుండా జరిగి తీరాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Chances For Team India To Reach World Test Championship Final: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో.. భారత్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. కానీ.. భారత్ పరిస్థితే ఇంకా అగమ్యగోచరంగా తయారైంది. నిజానికి.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో భారత్ 10 విజయాలతో రెండో స్థానంలో ఉంది. కానీ, ఫైనల్స్లో అర్హత కోసం భారత్, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే.. పరిస్థితులు దాదాపు భారత్కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలిచినా, కనీసం డ్రాగా ముగిసినా.. ఫైనల్స్కు టీమిండియా అర్హత సాధిస్తుంది. కానీ, ఓడిపోతేనే ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత జట్టు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రత పై సస్పెన్స్.. పిటీషన్ పై విచారణ వాయిదా
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
అదెలా అంటే..?
ఈ నెలలో మార్చి 9వ తేదీన శ్రీలంక, న్యూజీలాండ్ జట్టు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో న్యూజిలాండ్ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్ను వెనక్కు నెట్టేసి, శ్రీలంక ఫైనల్స్కి చేరుకుంటుంది. ఒకవేళ శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ గెలిచి.. రెండో మ్యాచ్ ఓడినా, డ్రాగా ముగిసినా.. శ్రీలంక జట్టు ఫైనల్స్ అవకాశం కోల్పోయినట్టే! అంటే.. భారత్ జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్స్కు క్వాలిఫై అవుతుంది. ఈ లెక్కన.. శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తేనే, ఫైనల్స్కు అర్హత సాధిస్తుందన్నమాట! అయితే.. న్యూజీలాండ్ టీమ్ ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉంది కాబట్టి, శ్రీలంకకు క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యమే! కాబట్టి.. ఫైనల్స్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Lionell Messi: నీ కోసమే వెయిటింగ్.. మెస్సీకి బెదిరింపు లేఖ
ఇదిలావుండగా.. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లు జరిగాయి. తొలి రెండు మ్యాచెస్లో భారత్ గెలుపొందగా, మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో.. 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఓవైపు నాలుగో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ నెగ్గాలని చూస్తుంటే, మరోవైపు నాలుగో టెస్టులోనూ సత్తా చాటి ఈ సిరీస్ని డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా చూస్తోంది. మరి, ఈ నాలుగో మ్యాచ్లో ఇరు జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో, ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!