WTC 2023 Final: భారత్ ఫైనల్కు చేరాలంటే.. అది తప్పకుండా జరిగి తీరాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Chances For Team India To Reach World Test Championship Final: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో.. భారత్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. కానీ.. భారత్ పరిస్థితే ఇంకా అగమ్యగోచరంగా తయారైంది. నిజానికి.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో భారత్ 10 విజయాలతో రెండో స్థానంలో ఉంది. కానీ, ఫైనల్స్లో అర్హత కోసం భారత్, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే.. పరిస్థితులు దాదాపు భారత్కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలిచినా, కనీసం డ్రాగా ముగిసినా.. ఫైనల్స్కు టీమిండియా అర్హత సాధిస్తుంది. కానీ, ఓడిపోతేనే ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత జట్టు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రత పై సస్పెన్స్.. పిటీషన్ పై విచారణ వాయిదా
Also Read
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
అదెలా అంటే..?
ఈ నెలలో మార్చి 9వ తేదీన శ్రీలంక, న్యూజీలాండ్ జట్టు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో న్యూజిలాండ్ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్ను వెనక్కు నెట్టేసి, శ్రీలంక ఫైనల్స్కి చేరుకుంటుంది. ఒకవేళ శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ గెలిచి.. రెండో మ్యాచ్ ఓడినా, డ్రాగా ముగిసినా.. శ్రీలంక జట్టు ఫైనల్స్ అవకాశం కోల్పోయినట్టే! అంటే.. భారత్ జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్స్కు క్వాలిఫై అవుతుంది. ఈ లెక్కన.. శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తేనే, ఫైనల్స్కు అర్హత సాధిస్తుందన్నమాట! అయితే.. న్యూజీలాండ్ టీమ్ ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉంది కాబట్టి, శ్రీలంకకు క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యమే! కాబట్టి.. ఫైనల్స్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Lionell Messi: నీ కోసమే వెయిటింగ్.. మెస్సీకి బెదిరింపు లేఖ
ఇదిలావుండగా.. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లు జరిగాయి. తొలి రెండు మ్యాచెస్లో భారత్ గెలుపొందగా, మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో.. 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఓవైపు నాలుగో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ నెగ్గాలని చూస్తుంటే, మరోవైపు నాలుగో టెస్టులోనూ సత్తా చాటి ఈ సిరీస్ని డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా చూస్తోంది. మరి, ఈ నాలుగో మ్యాచ్లో ఇరు జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో, ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!