భారత్ – పాక్ : కంపెనీలకు కూడా పండుగే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజా రాజా…బాబర్ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ పోటాపోటీ కథనాలు నడుపుతాయ్. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం…క్రీడాభిమానులందరూ టీవీలకే అతుక్కుపోతారు. అదే మ్యాచ్ ఆదివారం వస్తే.. ఇంకేమైనా ఉందా? రికార్డు స్థాయిలో టీఆర్పీలు నమోదవుతాయి. ఈ నెల 24న కూడా ఇదే జరగబోతోంది. పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకూ పండుగే. భారత్-పాకిస్తాన్ టీ 20 మ్యాచ్ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ ప్రజలకు దగ్గరవుతుంది. అందుకే కంపెనీలు కూడా మ్యాచ్ సమయంలో ప్రకటనలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయ్.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ను…ప్రసార హక్కుల కలిగిన స్టార్ ఇండియా…క్యాష్ చేసుకుంటోంది. యాడ్ ఇస్తే వసూలు చేసే మొత్తాన్ని దాదాపు 50 శాతం పెంచేసింది. ఇండియా-పాక్ మ్యాచ్లో 5,500 సెకన్ల యాడ్స్తో ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. పది సెకన్ల యాడ్కు రూ.25 లక్షలు తీసుకుంటోంది. సాధారణంగా భారత్ ఇతర మ్యాచులకు…ఇప్పటి వరకు పది సెకన్ల యాడ్కు 16 నుంచి రూ.18 లక్షలు వసూలు చేస్తోంది. యాడ్స్ ద్వారానే భారీగా డబ్బు రాబట్టుకునేందకు రెడీ అయింది స్టార్ యాజమాన్యం. అందులో భాగంగానే…యాడ్ రేట్లను ఊహించని విధంగా పెంచేసింది.
అయితే స్టార్ ఇండియా టార్గెట్పై వరణుడు ఎలాంటి ప్రభావం చూపుతాడో అర్థం కావడం లేదు. ఆదివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని…వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం పడేందుకు దాదాపు 60 శాతం అవకాశముందని అంటున్నారు
మరోవైపు పాకిస్తాన్ క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా. టీ20 ప్రపంచకప్లో భారత జట్టును మట్టి కరిపించగలిగితే ఓ బ్లాంక్ చెక్ను ఈనామ్గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్పై తమ జట్టు విజయం సాధిస్తే… గిఫ్ట్గా బ్లాంక్ చెక్ ఇస్తానని, దాని మీద ఎంత మొత్తమైనా రాసుకోవచ్చని ఓ బడా పారిశ్రామికవేత్త ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చిన ఆ పెట్టబడిదారుడి పేరును వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. దాని గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టం చేశారు. అక్టోబర్ 24వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ తరువాత.. అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. బాబర్ ఆజమ్ సారథ్యంలోని తమ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్లల్లో పకడ్బందీగా ఉందని, ఎలాంటి ప్రత్యర్థినయినా ఓడించగలుగుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!