ఐపీఎల్ సీజన్ 2022లో జట్లు మధ్య పోటీ గట్టిగానే ఉంది. రోజురోజుకు మ్యాచ్లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్ స్టేడియ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంకుని బరిలోకి దిగగా ఆదిలోని షాక్ తగిలింది. సౌథీ బౌలింగ్లో సామ్ బిల్లింగ్స్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (5 బంతుల్లో 7; ఫోర్) ఔటయ్యాడు.
రెండో ఓవర్లోనే గిల్ వికెట్ పడటంతో గుజరాత్ టైటాన్స్ ఆచితూచి ఆడింది. అయితే సాహా రూపంలో రెండో వికెట్ను గుజరాత్ కోల్పోయింది. ఆ తరువాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డేవిడ్ మిల్లర్ ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా 18వ ఓవర్లో గుజరాత్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు 156/59 పరుగులు సాధించింది.