GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..
- ఉత్కంఠ మ్యాచ్లో రాజస్థాన్ సూపర్ విక్టరీ
- జురెల్, జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్
- బిష్ణోయ్ స్పిన్తో మ్యాచ్ టర్న్
- చివరి ఓవర్లో దేశ్పాండే హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో శుభారంభం ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 42 బంతుల్లోనే 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా మెరుపులతో రాజస్థాన్ తన స్కోరును 200 దాటించింది. గుజరాత్ బౌలర్లలో అశోక్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, మహమ్మద్ సిరాజ్ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది.
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్ , కుమార్ కుశాగ్ర మంచి పునాది వేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే, మిడిల్ ఓవర్లలో రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. బిష్ణోయ్ ఒకే ఓవర్లో రాహుల్ తెవాటియా , గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లు తీసి మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాడు. చివర్లో రషీద్ ఖాన్ (24) , కగిసో రబాడ (23) పోరాడినప్పటికీ, రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణ ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
- Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ పరాగ్ బంతిని తుషార్ దేశ్పాండేకు అప్పగించాడు. దేశ్పాండే అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన రషీద్ ఖాన్, ఆర్చర్ చేతికి చిక్కి అవుట్ కావడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన తరుణంలో దేశ్పాండే వేసిన ఫుల్ టాస్ను అశోక్ శర్మ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్భుత స్పెల్ వేసిన రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!