GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..
- ఉత్కంఠ మ్యాచ్లో రాజస్థాన్ సూపర్ విక్టరీ
- జురెల్, జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్
- బిష్ణోయ్ స్పిన్తో మ్యాచ్ టర్న్
- చివరి ఓవర్లో దేశ్పాండే హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో శుభారంభం ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 42 బంతుల్లోనే 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా మెరుపులతో రాజస్థాన్ తన స్కోరును 200 దాటించింది. గుజరాత్ బౌలర్లలో అశోక్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, మహమ్మద్ సిరాజ్ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది.
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్ , కుమార్ కుశాగ్ర మంచి పునాది వేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే, మిడిల్ ఓవర్లలో రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. బిష్ణోయ్ ఒకే ఓవర్లో రాహుల్ తెవాటియా , గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లు తీసి మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాడు. చివర్లో రషీద్ ఖాన్ (24) , కగిసో రబాడ (23) పోరాడినప్పటికీ, రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణ ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ పరాగ్ బంతిని తుషార్ దేశ్పాండేకు అప్పగించాడు. దేశ్పాండే అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన రషీద్ ఖాన్, ఆర్చర్ చేతికి చిక్కి అవుట్ కావడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన తరుణంలో దేశ్పాండే వేసిన ఫుల్ టాస్ను అశోక్ శర్మ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్భుత స్పెల్ వేసిన రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!