IPL 2023 : అహ్మదాబాద్ కు వర్ష సూచన.. మ్యాచ్ జరిగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ్టి నుంచి ఇంండియన్ ప్రీమియల్ లీగ్ 16వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే సిద్దమైంది. ఇక సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కేల మధ్య జరుగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్ లో తొలి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

Also Read
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
Also Read : 6G Technology: ఇక.. 6G దిశగా.. రెడీ అవుతున్న ఇండియా. 100 పేటెంట్లు భారతీయుల సొంతం
అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురువడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సెషల్ లను రద్దు చేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే అంశం. మ్యాచ్ సమయానికి కూడా ఇలాగే వర్షం పడితే ఎలా అని ఆందోళణ పడుతున్నారు.
Also Read : North Korea : ఉత్తర కొరియాలోని అరాచకాలు వెలుగులోకి..
అయితే ఉదయం నుంచి అహ్మదాబాద్ లో వర్షం పడలేదు.. పైగా ఎండ బాగానే కాస్తుంది. అయితే వర్షం పడే అవకాశాలు అసలు లేవని.. ఒకవేళ ఉన్నా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రానికి కల్లా పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా జరుగుతుంది.
Also Read : Jana Reddy: బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం
ఇక ప్రారంభ వేడుకలకు ఐపీఎల్ నిర్వహకులు ఘనంగా నిర్వహించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సింగర్ అరిజిత్ సింగ్ తమ ప్రదర్శనతో అలరించనున్నారు. అయితే తొలి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అందుబాటులో ఉండేది అనుమానంగా ఉంది. అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ ధోని ఆడకపోతే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చూడాలి. బెన్ స్టోక్స్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. మరోవైపు ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్ సీఎస్కేపై నెగ్గి తమ ఆధిపత్యం చూపించాలని అనుకుంటుంది. గత సీజన్ లో గుజరాత్ తో తలపడిన రెండు మ్యాచ్ ల్లోను సీఎస్కే ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!