6G Technology: ఇక.. 6G దిశగా.. రెడీ అవుతున్న ఇండియా. 100 పేటెంట్లు భారతీయుల సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6G Technology: ప్రపంచంలో అంతం అంటూ లేనివాటిలో టెక్నాలజీ కూడా ఒకటి. అందుకే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు తెర మీదికొస్తున్నాయి. తద్వారా.. మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సులభంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఇండియాలోకి 5జీ టెక్నాలజీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంకేతికత.. భారతదేశంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వ అంచనాలను మించిపోయింది.
Marry Now Pay Later: పెళ్లికి డబ్బు కావాలా? Marry Now-Pay Later అంటున్న సంస్థ
Also Read
ఈ నెలాఖరు నాటికి 200 సిటీలకు 5జీ టెక్నాలజీ విస్తరిస్తుందని కేంద్రం ఆశించగా.. రెట్టింపు సంఖ్యలో.. 397 నగరాల్లోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్వర్క్లతో రాకెట్ స్పీడుతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్లు ఇక 6G టెక్నాలజీ డెవలప్మెంట్పై దృష్టిపెట్టారు. ఈ మేరకు సైంటిస్టులు, ఇంజనీర్లు, అకాడమీషియన్లు ఇప్పటికే 100 పేటెంట్లను సొంతం చేసుకోవటం విశేషం.
ఈ పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇండియా వరల్డ్లోనే అతిపెద్ద ఎకానమీగా ఎదగనుందని పేర్కొంది. పరిపాలన, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం తదితర రంగాల్లో పరివర్తన ద్వారా ఇది సాధ్యపడుతుందని తెలిపింది. ఈ విషయమై.. కేంద్ర ఐటీ మరియు టెలికం శాఖల మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ.. మన దేశం ఇప్పటికే మూడున్నర ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని అన్నారు.
ఈ విలువను రూపాయల్లో చెప్పాలంటే.. 2 కోట్ల, 89 లక్షల, 20 వేల, 500 కోట్లు అని అర్థం. భారతదేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే.. వేల సంఖ్యలో ఉన్న వ్యవస్థల్లో మార్పు రావాలని చెప్పారు. పరిపాలన, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, బిజినెస్ వంటి రంగాల్లో మార్పులు వస్తే.. ఇండియాని ఏ శక్తీ ఆపజాలదని, 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రేంజ్కి చేరుకొని తీరుతుందని ధీమా వెలిబుచ్చారు.
పదేళ్ల కిందట మన దేశం 99 శాతం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు 99 శాతం మొబైల్ ఫోన్లను స్థానికంగానే తయారుచేసుకోగలుగుతోందని గుర్తుచేశారు. ఇండియాలో ప్రతిభకు కొదవలేదని, అయితే.. ఆ ట్యాలెంట్ పీపుల్ని సరైన మార్గంలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన భారత్ స్టార్టప్ సమ్మిట్లో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ మేరకు ప్రసంగించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!