IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. ఒక్క వికెట్ నష్టపోకుండా విక్టరీ
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన జింబాబ్వే
- ఐదు మ్యాచ్ల సిరీస్ని 3-1తో కైవసం
- చెలరేగిన యశస్వి జైస్వాల్..గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ని 3-1తో కైవసం చేసుకుంది. హరారేలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా అత్యధికంగా 46 పరుగులు చేశాడు.
READ MORE: World Skydiving Day: 12 వేల మీటర్ల ఎత్తు నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్కైడైవింగ్..
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
- Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక
- ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఎంతో శ్రమించి 153 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ ఆటగాళ్లు ఆ స్కోర్ ను చేధించారు. ఓపెనింగ్ జోడి శుభ్మన్ గిల్, జైస్వాల్ ఆటను ముగించారు. గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు (58 నాటౌట్) బాదాడు. యశస్వి జైస్వాల్ (93 నాటౌట్) ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో ఇరగ్గొట్టాడు. ఛేదనలో ఈ జోడి తడబడ్డ సందర్భమే కనిపించలేదు. వీరిద్దరిని ఆతిథ్య జట్టు ఆడ్డుకోలేకపోయింది. 150 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించి.. భారత యువ కెరటాల సత్తాచాటారు.
READ MORE: World Skydiving Day: 12 వేల మీటర్ల ఎత్తు నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్కైడైవింగ్..
బౌలర్లు శివమ్ దూబే మరియు అభిషేక్ శర్మల అద్భుత ప్రదర్శన కారణంగా జింబాబ్వే 152 పరుగులకే పరిమితం అయ్యింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారత ఐదో బౌలర్ అభిషేక్ (20/1), ఆరో సబ్స్టిట్యూట్గా వచ్చిన దూబే (11/1) చక్కటి బౌలింగ్తో జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ వెస్లీ మాధవెరె (24 బంతుల్లో 25 పరుగులు), తాడివనాషే మారుమణి (31 బంతుల్లో 32 పరుగులు)లను అవుట్ చేయడం ద్వారా అతను మిడిల్ ఓవర్లను నియంత్రించాడు. అయితే కెప్టెన్ రజా తన ఇన్నింగ్స్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది జింబాబ్వేను 150 పరుగులకు పైగా స్కోరుకు తీసుకెళ్లాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మినహా భారత బౌలర్లందరికీ వికెట్లు దక్కాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!