ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో పోటీ పడింది టీం ఇండియా. అయితే ఈ సిరీస్ లోని చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయ్యింది. భారత జట్టులోని కోచ్ రవిశాస్త్రితో పాటుగా మరికొంత మంది సహాయక సిబ్బందికి కరోనా రావడంతో చివరి నిమిషంలో మ్యాచ్ ను రద్దు చేసాయి రెండు దేశాల క్రికెట్ బోర్డులు. ఆ వెంటనే అక్కడి నుండి ఐపీఎల్2021 కోసం యూఏఈ చేరుకున్నారు ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తే తాము చాలా నష్టపోతామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐసీసీ వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత ఈ మ్యాచ్ ను మళ్ళీ జరుగుతుంది అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన బీసీసీఐ ఆ విషయం పై ఏం స్పందించలేదు. ఇక తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జులైలో నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు 2-1 తో భారత జట్టు ముందజలో ఉన్న విషయం తెలిసిందే.