Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో శ్రీలంకకు సిరీస్ సమం చేసే అవకాశం లేకపోయింది. అయితే సిరీస్లో ఓటమి ఎదురైనా.. భవిష్యత్ శ్రీలంక క్రికెట్కు సంబంధించి పలు సానుకూల అంశాలు కనిపించాయని ఆ జట్టు కెప్టెన్ ధనంజయ డిసిల్వా అభిప్రాయపడ్డాడు. సిరీస్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్ జట్టును నిర్మించే దిశగా మంచి అడుగు పడిందని పేర్కొన్నాడు. సెలెక్టర్లు, కోచ్లు యువ ప్రతిభను గుర్తించి.. వారిని స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పించారని చెప్పాడు. అయితే గాయాల కారణంగా జట్టుకు దూరమైన సీనియర్లు వస్తే.. తమకు పెద్ద తలనొప్పి మొదలవుతుందని డిసిల్వా చెప్పుకొచ్చాడు.
‘ఈ సిరీస్లో సానుకూలంశాలు చాలానే ఉన్నాయి. భవిష్యత్ శ్రీలంక క్రికెట్ కోసం ప్రతిభావంతమైన ఆటగాళ్లను గుర్తించడం ఎంతో ముఖ్యం. సెలెక్టర్లు, కోచ్ నాకు ఆ అవకాశం కల్పించారు. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని.. దేశం కోసం తమ బాధ్యతను స్వేచ్ఛగా నిర్వర్తించేలా అవకాశం ఇచ్చారు. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు తిరిగి వస్తే జట్టులో పోటీ ఎదురవుతుంది. ఇది మంచి తలనొప్పే అనే చెప్పాలి. జట్టులోని ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు తిరిగి వస్తారు. మళ్లీ జట్టులో చోటు కోసం పోటీ తీవ్రమవుతుంది. ఇది మంచి విషయమే’ అని ధనంజయ డిసిల్వా చెప్పాడు.
Also Read
- R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
- Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
- Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘బహుశా గాలె టెస్టు రెండో ఇన్నింగ్స్లో నేను మరికొంతసేపు బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. అదే కీలకమైన సమయం. అక్కడే భారత్ మ్యాచ్లోకి తిరిగి వచ్చింది. చివరకు సిరీస్ను గెలుచుకుంది. మేము సిరీస్ ఓడినందుకు బాధగా ఉంది. భవిష్యత్తులో మంచి ఆట ఆడుతాం’ అని డిసిల్వా తెలిపాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 503/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఫాలోఆన్ విధించింది. రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 429/9 వద్ద డిక్లేర్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో భారత్ రెండు టెస్టుల సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. సోనల్ దినూష వంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించడం, కొత్త ప్రతిభకు అవకాశాలు దక్కడం శ్రీలంకకు ఈ సిరీస్లో లభించిన ప్రధాన సానుకూల అంశాలుగా నిలిచాయి. భవిష్యత్లో సీనియర్లు, యువ ఆటగాళ్ల మధ్య పోటీతో శ్రీలంక మరింత బలమైన జట్టుగా మారుతుందని డిసిల్వా ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!