IND Vs IRE: చరిత్ర సృష్టించిన దీపక్ హుడా-సంజు శాంసన్ జోడీ
ఐర్లాండ్ పర్యటనను హార్డిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం దీపక్ హుడా, సంజు శాంసన్ జోడీనే.
ఆదిలోనే ఇషాన్ కిషన్ 3 పరుగులకే అవుటైనా.. స్కోరు బోర్డును హుడా-శాంసన్ జోడీ పరుగులు తీయించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 87 బంతుల్లోనే 176 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీ20ల్లో టీమిండియా తరఫున ఏ వికెట్కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. గతంలో శ్రీలంకపై 2017లో రోహిత్-రాహుల్ జోడీ 165 పరుగులు చేసింది. అంతకుముందు రోహిత్-ధావన్ జోడీ 160 పరుగులు చేయగా, రోహిత్-ధావన్ జోడీ158 పరుగులు చేసింది. కాగా దూకుడుగా ఆడటం తనకు ఇష్టమని… బ్యాటింగ్కు ముందుగానే రావడంతో తనకు సమయం దొరికిందని దీపక్ హుడా తెలియజేశాడు. ఈ మ్యాచ్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడానని.. సంజూ శాంసన్ తనకు చిన్ననాటి మిత్రుడు అని.. తామిద్దరం కలిసి అండర్-19 క్రికెట్ కలిసి ఆడామని హుడా తెలిపాడు. ఈ మ్యాచ్లో సంజూ కూడా భారీ స్కోరు చేయడంతో తనకు ఆనందంగా ఉందని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న సమయంలో హుడా వివరించాడు.
Also Read
- Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
- SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
- KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
Read Also: IND Vs IRE: పోరాడి ఓడిన ఐర్లాండ్.. టీమిండియాదే సిరీస్
కాగా ఈ ఏడాది టీమిండియా వరుస మ్యాచ్లతో బిజీబిజీగా గడపనుంది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 18 నుంచి 30 వరకు మూడేసి టీ20లు, వన్డే మ్యాచ్లలో కివీస్తో భారత్ తలపడనుంది. నవంబర్ 18న వెల్లింగ్టన్, 20న టురంగా, 22న నేపియర్లో టీ20లు, 25న ఆక్లాండ్, 27న హామిల్టన్, 30న క్రైస్ట్చర్చ్లో వన్డేలు జరుగుతాయి. బదులుగా వచ్చే ఏడాది జనవరిలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో న్యూజిలాండ్ పర్యటించనుంది.
తాజావార్తలు
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!