IND Vs IRE: చరిత్ర సృష్టించిన దీపక్ హుడా-సంజు శాంసన్ జోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్ పర్యటనను హార్డిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం దీపక్ హుడా, సంజు శాంసన్ జోడీనే.
ఆదిలోనే ఇషాన్ కిషన్ 3 పరుగులకే అవుటైనా.. స్కోరు బోర్డును హుడా-శాంసన్ జోడీ పరుగులు తీయించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 87 బంతుల్లోనే 176 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీ20ల్లో టీమిండియా తరఫున ఏ వికెట్కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. గతంలో శ్రీలంకపై 2017లో రోహిత్-రాహుల్ జోడీ 165 పరుగులు చేసింది. అంతకుముందు రోహిత్-ధావన్ జోడీ 160 పరుగులు చేయగా, రోహిత్-ధావన్ జోడీ158 పరుగులు చేసింది. కాగా దూకుడుగా ఆడటం తనకు ఇష్టమని… బ్యాటింగ్కు ముందుగానే రావడంతో తనకు సమయం దొరికిందని దీపక్ హుడా తెలియజేశాడు. ఈ మ్యాచ్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడానని.. సంజూ శాంసన్ తనకు చిన్ననాటి మిత్రుడు అని.. తామిద్దరం కలిసి అండర్-19 క్రికెట్ కలిసి ఆడామని హుడా తెలిపాడు. ఈ మ్యాచ్లో సంజూ కూడా భారీ స్కోరు చేయడంతో తనకు ఆనందంగా ఉందని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న సమయంలో హుడా వివరించాడు.
Also Read
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
- Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
Read Also: IND Vs IRE: పోరాడి ఓడిన ఐర్లాండ్.. టీమిండియాదే సిరీస్
కాగా ఈ ఏడాది టీమిండియా వరుస మ్యాచ్లతో బిజీబిజీగా గడపనుంది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 18 నుంచి 30 వరకు మూడేసి టీ20లు, వన్డే మ్యాచ్లలో కివీస్తో భారత్ తలపడనుంది. నవంబర్ 18న వెల్లింగ్టన్, 20న టురంగా, 22న నేపియర్లో టీ20లు, 25న ఆక్లాండ్, 27న హామిల్టన్, 30న క్రైస్ట్చర్చ్లో వన్డేలు జరుగుతాయి. బదులుగా వచ్చే ఏడాది జనవరిలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో న్యూజిలాండ్ పర్యటించనుంది.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..