కోల్కతా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికే రెండు వికెట్లు కూడా తీశాడు. అతడి రెండో ఓవర్ కోటాను ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ పూర్తి చేశాడు. మళ్లీ దీపక్ చాహర్ బౌలింగ్కు కూడా రాలేదు.
ఈ నేపథ్యంలో గురువారం నుంచి శ్రీలకంతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్కు దీపక్ చాహర్ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. తొడ కండర గాయం ఏ స్థాయిలో ఉందన్నది తెలియాల్సి ఉంది. మొదటి గ్రేడ్ గాయం అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుందని అంచనా. ఒకవేళ పెద్ద గాయమే అయితే.. ఐపీఎల్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాల్సి ఉంది. దీపక్ చాహర్ను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.14 కోట్లకు చెన్నై జట్టు సొంతం చేసుకుంది.