మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్స్టాగ్రామ్లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ, అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యిందని తెలిసి కొద్దిగా బాధపడ్డానని తెలిపింది. ఇప్పటికి హృతిక్ సినిమాలను చూస్తానన్న స్మృతీ ప్రస్తుతం క్రికెట్ తో పాటు బిజినెస్ లోను అడుగుపెట్టింది. నైకీ బ్రాండ్ కి స్మృతీ బ్రాండ్ అంబాసిడర్ గా మారనుంది. త్వరలోనే స్మృతీ యాడ్ షూట్ లో పాల్గొననున్నట్లు సమాచారం.