వివాదంలో గంగూలీ.. రెండుగా చీలిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది.
అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ రెండుసార్లు హాజరయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంలో గంగూలీపై చాలా మంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తనకు సంబంధం లేని సెలక్షన్ సమావేశాలకు గంగూలీ ఎందుకు వెళ్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. దీంతో బీసీసీఐ రెండుగా చీలింది. గంగూలీ తీరును కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
ప్రస్తుతం బీసీసీఐ వ్యవహారాలన్నీ మారిపోయాయని.. అసలు సెలక్షన్ కమిటీ సమావేశాలకు గంగూలీ రావాల్సిన అవసరమేంటని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు గంగూలీపై క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు గంగూలీ ఎప్పుడూ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. తాజా వివాదం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు గంగూలీ, జై షా వారి పదవుల్లో కొనసాగాల్సి ఉన్నా.. అప్పటిదాకా ఉంటారా? అన్న చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం