Gambhir vs MS Dhoni: ఎంఎస్ ధోనీకి బీసీసీఐ బంపర్ ఆఫర్.. మరీ గంభీర్ మావా ఒప్పుకుంటాడా?
- ఎంఎస్ ధోనికి బీసీసీఐ బంఫర్ ఆఫర్..
- టీమిండియాకు మెంటార్గా ధోనీని నియమించుకోవడానికి ప్లాన్..
- భారత జట్టుకు మెంటార్గా ధోనీ రాకను గంభీర్ ఒప్పుకుంటాడా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambhir vs MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ భారత్కు రెండు ప్రపంచ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఇక, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఇప్పటికీ తన మాయాజాలంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అయితే, 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లోనే కొనసాగుతున్నాడు. ఇక, వచ్చే సీజన్లో బరిలోకి దిగుతాడా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో ధోనీకి బీసీసీఐ స్పెషల్గా ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రచారం అవుతుంది.
Read Also: SI Attack: యూరియా కోసం క్యూ లైన్లలో నిలిచిన రైతులపై చేయి చేసుకున్న ఎస్ఐ..
Also Read
- SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
- Shubman Gill: "మా ప్లాన్ వర్కవుట్ అయింది".. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Pat Cummins: "ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా".. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
అయితే, 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో ధోనీని బీసీసీఐ మెంటార్గా ఎంపిక చేసుకుంది. కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ధోనీకి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.. కానీ, ఈసారి మాత్రం అలా షార్ట్టర్మ్ కాకుండా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడికి చురుకైన వ్యూహాలను సుదీర్ఘంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అందుకే, మరోసారి మెంటార్గా ధోనీని నియమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి మాజీ కెప్టెన్ అందుకు ఒప్పుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాఫిక్.
Read Also: Headmaster Assaults: విద్యార్థులను చిత్రహింసలు పెట్టిన హెడ్ మాస్టర్ అరెస్ట్!
ఇక, ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు. మెంటార్గా ధోనీని తీసుకుంటే.. దానికి అతడు అంగీకరించకపోవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో విజయం సాధించిన వన్డే, టీ20 ప్రపంచకప్ జట్లలో గౌతమ్ గంభీర్ కూడా సభ్యుడే.. అప్పుడు క్రెడిట్ మొత్తం కెప్టెన్ గా ధోనీకి ఇవ్వడం సరికాదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. భారత జట్టు కలసికట్టుగా ఆడితేనే గెలిచామని చెప్పే గంభీర్.. ధోనీ వంటి క్రికెటర్ను తనకంటే కాస్త పైపదవిలో ఉంచడానికి ఇష్టపడతాడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని సరదాగా గడిపిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!