Headmaster Assaults: విద్యార్థులను చిత్రహింసలు పెట్టిన హెడ్ మాస్టర్ అరెస్ట్!
- విద్యార్థులపై దారుణంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు..
- ఆరేళ్ల బాలుడిని కాలు కింద వేసి కర్రతో కొట్టిన హెడ్ మాస్టర్..
- ప్రధానోపాధ్యాయుడిని అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Headmaster Assaults: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించిన వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం వెంటనే అతడిపై చర్యలు తీసుకుంది. అయితే, ఈ ఆగస్టు 26వ తేదీన కుంభకోణంలోని అర్జుని గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక, ఆరేళ్ల బాలుడు రవి భాళవి నోరు గట్టిగా మూసి, బలవంతంగా నేలపైన ఉన్న హెడ్ మాస్టర్ మహేష్ చౌదరి పడుకోబెట్టి.. అతని వెన్నెముకపై కర్ర పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ బాలుడి వీపుపై తీవ్ర గాయమైంది. అలాగే, మరో వైపు ఇంకో చిన్నారిని కూడా సదరు ప్రిన్సిపాల్ చితకబాదుతుండటం కనిపిస్తుంది.
Read Also: Hamas-Israel: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి వీడియోను విడుదల చేసిన నెతన్యాహు.. ఎందుకోసమంటే..!
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
అయితే, తమ పిల్లలపై ఉపాధ్యాయుడు తరచుగా దాడి చేసినట్లు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదు. కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడు రాకేష్ సనోడియా పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేయగా.. హెడ్ మాస్టర్ మహేష్ చౌదరి విద్యార్థులను కొట్టడం చూశారు. సదరు టీచర్ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల కుటుంబాలు డిమాండ్ చేశాయి.
Read Also: Ghati : సెన్సార్ ముగించుకున్న ‘ఘాటి’.. ఇంటర్వెల్ తర్వాత ఊచకోతేనా! .
మరోవైపు, వైరల్ అయిన వీడియోను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ అమర్ సింగ్ ఉయికే మహేష్ చౌదరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అతన్ని ఘన్సోర్ బ్లాక్ ఆఫీసర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే, హెడ్ మాస్టర్ పై బాధితుడైన రవి తండ్రి విజయ్ భాళవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 296, 115(2)తో పాటు ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీస్ నిరోధక) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. గాయపడిన బాలుడికి చికిత్స కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!