భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక కాంట్రాక్టులు జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్కు చేరారు. ఫామ్లో లేకపోవడం వల్ల వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్లోనూ స్థానం కోల్పోయారు. మరో స్టార్ ఆటగాడు, ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా ‘ఏ’ గ్రేడ్లో స్థానం కోల్పోయాడు. గాయాలతో బాధపడుతున్న హార్థిక్ ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్కు పడిపోయాడు.వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ‘బీ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్కు తగ్గింది.
మరోవైపు బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో నాలుగు స్థానాలు ఉంటాయి. ఏ++ కు బీసీసీఐ 7కోట్ల రెమ్యూనరేన్ చెల్లిస్తుంది. అలాగే, ఏ, బీ, సీ గ్రేడ్లకు రూ. 5కోట్లు, రూ. 3కోట్లు, ఒక కోటి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంది.