Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
- బంగ్లాదేశ్ క్రికెటర్ నయీమ్ హసన్పై పోలీసులు దాడి..
- స్టేషన్ తీసుకెళ్లి లాఠీలతో కొట్టినట్లు ఆరోపణలు..
- ఘటనపై బంగ్లాదేశ్లో తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ నయీమ్ హసన్పై పోలీసులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం ఆ దేశంలో సంచలనంగా మారింది. చిట్టగాంగ్లోని పోలీస్ అధికారులు తనతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, లాఠీలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టారని 25 ఏళ్ల నయీమ్ ఆరోపించారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీ), క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్లో ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ పాల్గొన్న ఒక కార్యక్రమం తర్వాత నయీమ్ హసన్ శుక్రవారం రాత్రి ఢాకా నుండి చిట్టగాంగ్లోని తన ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది. లాల్ఖాన్ బజార్ ప్రాంతం సమీపంలో అతను ప్రయాణిస్తున్న సీఎన్జీ ఆటో-రిక్షాను కొంతమంది పోలీసులు ఆపి, అతడి గొంతు పట్టుకుని ఆటోలో కూర్చోబెట్టి స్టేషన్కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజలు అతను నేషనల్ టీమ్ క్రికెటర్ అని చెబుతున్నా వినకుండా తనతో దురుసుగా ప్రవర్తించారని నయీమ్ ఆరోపించారు.
Also Read
- Women's T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్దే’
- Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
- Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
‘‘నేను జాతీయ క్రికెటర్నని వారికి చెబుతూనే ఉన్నాను, కానీ వారు వినడానికి నిరాకరించారు. వారు నన్ను కర్రలతో, ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. నేను పోలీస్ స్టేషన్కు చేరుకుని, నా వివరాలు చెప్పినప్పుడు కూడా నన్ను గౌరవంగా చూడలేదు’’ అని నయీమ్ హసన్ వెల్లడించారు. తనను ప్రశ్నించాలంటే పోలీస్ జీపులో తీసుకెళ్లాలి కానీ, ఇలా ఆటోలో తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి, దోషులపై శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం దర్యాప్తు ప్రారంభించారు. విధుల్లో ఉన్న అధికారులు నియమాలను పాటించలేదని తెలుస్తోదని ఆయన అంగీకరించారు. దోషిగా తేలిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై సీనియర్ క్రికెటర్ ముష్పీకర్ రహీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఈ ఘటనపై విమర్శలు చేస్తు్న్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
-
Iran: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడంటే..!
-
Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!