Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
- బంగ్లాదేశ్ క్రికెటర్ నయీమ్ హసన్పై పోలీసులు దాడి..
- స్టేషన్ తీసుకెళ్లి లాఠీలతో కొట్టినట్లు ఆరోపణలు..
- ఘటనపై బంగ్లాదేశ్లో తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ నయీమ్ హసన్పై పోలీసులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం ఆ దేశంలో సంచలనంగా మారింది. చిట్టగాంగ్లోని పోలీస్ అధికారులు తనతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, లాఠీలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టారని 25 ఏళ్ల నయీమ్ ఆరోపించారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీ), క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్లో ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ పాల్గొన్న ఒక కార్యక్రమం తర్వాత నయీమ్ హసన్ శుక్రవారం రాత్రి ఢాకా నుండి చిట్టగాంగ్లోని తన ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది. లాల్ఖాన్ బజార్ ప్రాంతం సమీపంలో అతను ప్రయాణిస్తున్న సీఎన్జీ ఆటో-రిక్షాను కొంతమంది పోలీసులు ఆపి, అతడి గొంతు పట్టుకుని ఆటోలో కూర్చోబెట్టి స్టేషన్కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజలు అతను నేషనల్ టీమ్ క్రికెటర్ అని చెబుతున్నా వినకుండా తనతో దురుసుగా ప్రవర్తించారని నయీమ్ ఆరోపించారు.
Also Read
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
‘‘నేను జాతీయ క్రికెటర్నని వారికి చెబుతూనే ఉన్నాను, కానీ వారు వినడానికి నిరాకరించారు. వారు నన్ను కర్రలతో, ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. నేను పోలీస్ స్టేషన్కు చేరుకుని, నా వివరాలు చెప్పినప్పుడు కూడా నన్ను గౌరవంగా చూడలేదు’’ అని నయీమ్ హసన్ వెల్లడించారు. తనను ప్రశ్నించాలంటే పోలీస్ జీపులో తీసుకెళ్లాలి కానీ, ఇలా ఆటోలో తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి, దోషులపై శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం దర్యాప్తు ప్రారంభించారు. విధుల్లో ఉన్న అధికారులు నియమాలను పాటించలేదని తెలుస్తోదని ఆయన అంగీకరించారు. దోషిగా తేలిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై సీనియర్ క్రికెటర్ ముష్పీకర్ రహీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఈ ఘటనపై విమర్శలు చేస్తు్న్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!