Bajrang Punia: బ్రిజ్భూషణ్ 15 రూపాయల వ్యాఖ్యలపై పూనియా స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajrang Punia And Sakshi Malik Gives Strong Counter To Brij Bhushan: భారత రెజ్లర్లు సాధించిన పథకాలను వెలకడుతూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెజ్లర్లు సాధించిన పథకాలు కనీసం రూ.15 కూడా విలువ చేయవని.. వాళ్లు తమ పథకాల్ని కాకుండా, కోట్లలో పొందిన ప్రోత్సాహకాల్ని తిరిగి ఇవ్వాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తామెంతో కష్టపడి సాధించిన పథకాలపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బ్రిజ్భూషణ్పై మండిపడుతున్నారు. తాజాగా ఒలింపిక్ మెడలిస్ట్ బజ్రంగ్ పూనియా సైతం ఆయనపై ధ్వజమెత్తాడు. ఆ మెడల్ని బ్రిజ్భూసణ్ తమకు భిక్షంగా ఇవ్వలేదంటూ కౌంటర్ వేశాడు.
Peedika Rajanna Dora: చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆగ్రహం
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
‘‘ఈ మనిషి (బ్రిజ్భూషణ్ను ఉద్దేశిస్తూ) ఏ పథకాలకైతే రూ.15 వెలకట్టాడో, దాని వెనకాల మా 15 సంవత్సరాల కష్టం ఉంది. నీలాంటి మనుషులు మాకు ఆ పథకాలను భిక్షంగా ఇవ్వలేదు. రాత్రనక పగలనక చెమటోడ్చి, మా రక్తం ధారపోసి, దేశం కోసం కోసం గెలిచిన పథకాలవి. ఆడవాళ్లను ఆటబొమ్మల్లా కాకుండా, ఆటగాళ్లను మనుషులుగా భావించి ఉంటే.. అతని నోటి నుంచి ఇలాంటి దిగజారుడు మాట వచ్చేది కాదు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా బజ్రంగ్ పూనియా విరుచుకుపడ్డాడు. అలాగే తన ట్వీట్కి బ్రిజ్భూషణ్ వ్యాఖ్యానించిన వీడియోని సైతం షేర్ చేశాడు. పూనియాతో పాటు మరో రెజ్లర్ సాక్షి మలిక్ కూడా అంతేస్థాయిలో ధ్వజమెత్తింది. బ్రిజ్భూషణ్కు కనపడిన 15 రూపాయల పతకం కోసమే సర్వస్వాన్ని ధారపోశామని.. అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించాలని సూచించింది.
Icecream : ఆ ఐస్క్రీమ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఇదిలావుండగా.. బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అతనికి వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసి జైల్లో వేయాలని నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు బ్రిజ్భూషణ్పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఆయనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఒక ప్రత్యేక కమిటీ ఈ కేసుని విచారిస్తోంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..