Australia : నెంబర్ వన్ ప్లేస్ కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. అప్పటి వరకూ నెంబర్ వన్ జట్టుగా ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై వన్డేలో గెలిచిన ఆసీస్ ఖాతాలో 113.286 రేటింగ్ పాయింట్లు చేరగా.. భారత్ ఖాతాలో 112.638 పాయింట్లు ఉన్నాయి. చివరి వన్డే ప్రారంభానికి ముందు భారత్ 114 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండేది, ఆస్ట్రేలియా ఖాతాలో 112 పాయింట్లు ఉండేవి.
Also Read : Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
మరోవైపు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించినప్పటికీ.. తొలి స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయింది. వరుసగా టీమిండియా.. ఇండోర్ టెస్టులో అనూహ్య రీతిలో ఓడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డ మీద నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడింది.
Also Read : TSPSC Remand Report: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఆడిన తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్.. తర్వాత స్మిత్ నాయకత్వంలో చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్ లో తలపడింది. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఒక వన్టేలో మాత్రమే ఓడింది. చివరి వన్డేలోనూ భారత్ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. స్మిత్ అద్భుత కెప్టెన్సీతో భారత్ కు విజయం దూరమైంది. చివరి వన్డేలో భారత్ బ్యాటింగ్ చేసిన తీరు.. భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలే ఈ ఏడాది చివర్ లో వన్డే వరల్డ్ కప్ జరుగునుండటంతో.. టీమిండియా ఆటగాళ్ల ఆటతీరు కలవరానికి గురి చేస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!