TSPSC Remand Report: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
TSPSC Remand Report: TSPSC పేపర్ లీకేజ్ కేసులో రీమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసామని, ముగ్గురిలో ఇద్దరు TSPSC ఉద్యోగులుని తెలిపింది. ఇప్పటవరకు నలుగురు TSPSC ఉద్యోగుల అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులని, 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రీమాండ్ రీపోర్ట్ లో సిట్ పేర్కొంది. TSPSC ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షి గా పేర్కొన్న సిట్ వెల్లడించింది. శంకర్ లక్ష్మితో పాటు TSPSC , తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొంది. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని సాక్షి గా సిట్ విచారణలో వెలువడింది. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో నిక్షిప్తమైన పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను ఆరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిట్ విచారనలో వెల్లడైంది.
read also: DCP Srinivas: మహేశ్వరం డీసీపీ.. ఏసీపీ కార్యాలయం ప్రారంభం
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
పేపర్ లీకేజీ నిందితుల పోలీసు కస్టడీ విచారణ గురువారంతో ముగిసింది. అరెస్టయిన సురేష్, రమేష్, షమీలకు ఏప్రిల్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో షమీకి 126, రమేష్ కు 120 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. రాజశేఖర్ రెడ్డి గ్రూప్ 1 పేపర్ను షమీకి వాట్సాప్లో పంపాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి షమీ ఇంట్లో సిట్ బృందం సోదాలు చేసింది. గ్రూప్-1లో వందకు పైగా మార్కులు వచ్చిన 121 మందిని గుర్తించారు. వారిలో కొందరికి నోటీసులు ఇచ్చారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉన్న సంగతి తెలిసింది. రాజశేఖర్ రెడ్డి బంధువు న్యూజిలాండ్ నుంచి పరీక్ష రాసేందుకు వచ్చినట్లు సిట్ గుర్తించింది..అతనితో పాటు మరికొందరు విదేశాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చినట్లు సమాచారం. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!