Legends League Cricket: గంభీర్ సేనను ఓడించిన పాక్ మాజీ కెప్టెన్ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండ్స్ లీగ్ క్రికెట్ దోహా వేదికగా (LLC)జరుగుతుంది. లీగ్ ను గౌతం గంజీర్ సారథ్యంలోని ఇండియా మహారాజాస్ జట్టు ఓటమితో ఆరంభించింది. పాకిస్తాన్ మజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిద్ సారథ్యంలోని ఆసియా లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాస్ కు ఓటమి తప్పలేదు. ఉత్కంఠంగా జరిగినా ఈ మ్యాచ్ లో ఆసియా లయన్స్ జట్టు 9 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ .. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ జట్టులో పాక్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ (50 బంతుల్లో 73, 2 ఫోర్లు, 4 సిక్సర్లు)కు తోడుగా శ్రీలంక మాజీ ఆటగాడు ఉపుల్ తరంగ(40) రాణించారు.
Aslo Read : Liquor Policy Case: కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీలో పరిణామాలపై కేసీఆర్ ఆరా
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
దిల్షాన్(5), అస్గర్ ఆఫ్గాన్ (1), అఫ్రిది (12), తిషారా పెరీరా (5), అబ్దుల్ రజాక్ (60) లు విఫలమయ్యారు. ఇండియా మహారాజాస్ బౌలర్లలో అవానా, స్టువర్ట్ బిన్నీలు తలా రెండు వికెట్లు తీయగా ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేధనలో ఇండియా మహారాజాస్.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప(0) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ కెప్టెన్ గౌతం గంభీర్ (39 బంతుల్లో 54, 7ఫోర్లు ), మురళీ విజయ్ (25) రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారు. విజయ్ ను దిల్షాన్ ఔట్ చేయంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా విఫలమయ్యాడు. మహ్మద్ కైఫ్ (22) ఫర్వాలేదనిపించగా యూసప్ పఠాన్ (14), స్టువర్ట్ బిన్నీ (8)లు నిరాశపరిచారు.
Aslo Read : Pallavi Case: మా అమ్మాయిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.. పల్లవి పేరెంట్స్
చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (19) ధాటిగా ఆడిగా పాకిస్తాన్ మాజీ బౌలర్ సోహైల్ తన్వీర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక మూడు వికెట్లు తీయడంతో ఇండియా మహారాజాస్ కు షాకులిచ్చాడు. 19వ ఓవర్లో తన్వీర్.. తొలి బంతికి బిన్నీతో పాటు చివరి బంతికి ఇర్ఫాన్ పఠాన్ ను ఔట్ చేసి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో రాణించిన మిస్భా ఉల్ హక్ కు ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ లీగ్ లో నేడు రాత్రి 8 గంటలకు ఇండియా మహారాజాస్ జట్టు, వరల్డ్ జెయింట్స్ తో పోటీ పడనుంది.
Aslo Read : Gold Smuggling : రైల్వేస్టేషన్లలో రూ.5.53 కోట్ల విలువైన బంగారం పట్టివేత
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!