IND vs PAK: పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్..
- పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్..
- ఒమన్తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన అక్షర్ పటేల్..
- అక్షర్ స్థానంలో తుది జట్టులోకి ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఆసియా కప్ లో రేపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఒమన్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు గట్టిగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఆ తర్వాత సబ్స్టిట్యూట్గా స్టేడియంలోకి రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, సూపర్- 4 ముందు స్పిన్ ఆల్రౌండర్కు ఇలా జరిగితే జట్టు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కోవల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇక, అక్షర్కు ఏం కాలేదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. అతడికి స్కానింగ్ చేసే అవకాశం ఉందన్నారు. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ రేపటి మ్యాచ్ లో ఆడొచ్చు.. లేకపోతే మరొకరిని తుది జట్టులోకి తీసుకుంటామన్నారు.
Read Also: MLC Kavitha: కొత్త పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, ఆదివారం సూపర్ -4లో పాకిస్థాన్తో భారత్ మరోసారి పోటీ పడబోతుంది. దీంతో అక్షర్ గైర్హాజరీలో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను బరిలోకి దించాల్సి ఉంటుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే మంచి ఫాంలో ఉండగా.. అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగలడు, అవసరమైతే అక్షర్ స్థానాన్ని కూడా భర్తీ చేస్తాడు. అక్షర్ పటేల్ ఉండటం వల్ల ఇటు బ్యాటర్గా, అటు బౌలర్గానూ రాణించేవాడు.. ఇక, రేపటి మ్యాచుకు వాషింగ్టన్ సుందర్ సిద్ధంగా ఉన్నాడు.
Read Also: Siva-Movie : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇక, ఒమన్తో మ్యాచ్కు ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తికి భారత జట్టు రెస్ట్ ఇచ్చింది. హర్షిత్ రాణా, అర్ష్దీప్సింగ్లను తుది జట్టులో ఆడించింది. అయితే, ఒమన్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు ఫెయిల్ అయ్యారు. దీంతో సూపర్-4 మ్యాచులకు మళ్లీ పాత జట్టునే బరిలోకి దింపే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు అక్షర్ లేకపోతే అదనంగా మరో బ్యాటర్ను తీసుకొనే అవకాశం ఉంది. రింకు సింగ్ తుది జట్టులో ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. లోయర్ బెర్త్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం అత్యంత కీలకం అని భారత్ భావిస్తుంది..
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!