Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం 30 మంది ప్రాబబుల్స్ (ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు) జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు సమర్పించింది. అయితే ఈ భారీ జాబితాలో ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఈ ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో వెస్టిండీస్తో భారత జట్టు స్వదేశంలో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్లు ఒకే సమయంలో వస్తుండటంతో, బిసిసిఐ ఒకేసారి రెండు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేయక తప్పడం లేదు. వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు గిల్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే అతడిని ఆసియా క్రీడల రేసు నుండి తప్పించారు. అంతే కాకుండా.. భవిష్యత్ ఒలింపిక్స్ (2028), తదుపరి టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో సూర్యకుమార్ పేరు లేనట్లు తెలుస్తోంది. అందుకే అతడిని ఈ జాబితాలో చేర్చలేదు.
Also Read
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
- Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
- IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్లో మార్పులు..
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
యువ సంచలనానికి చోటు..
ఇటీవల వార్తల్లో నిలిచిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ 30 మంది జాబితాలో చోటు దక్కింది. అలాగే గత ఆసియా క్రీడల్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను కూడా ఎంపిక చేశారు.
ఈ ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లేదా తిలక్ వర్మలలో ఒకరు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతడు వెస్టిండీస్ సిరీస్ ఆడేందుకే మొగ్గు చూపవచ్చు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ కూడా ఈ రేసులో ఉన్నారు. స్పిన్నర్లలో కుల్దీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబేలలో ఇద్దరిని ఆసియా క్రీడలకు, మిగిలిన ఇద్దరిని వెస్టిండీస్ సిరీస్కు ఎంపిక చేయనున్నారు.
ముఖ్యమైన ఆటగాళ్ల జాబితా..
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, శివమ్ దూబే తదితరులు ఈ 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!