ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుండి తప్పుకొనున విషయం తెలిసిందే. దాంతో అతని తర్వాత జట్టుకు ఎవరిని కెప్టెన్ చేయాలి అనే ప్రశ్న పై చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా భారత మాజీ పేవర్ ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఓ కొత్త పేరును ముందుకు తెచ్చాడు. అదే భారత పేవర్ బుమ్రా. అయితే బుమ్రా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటుంది ఆటగాడు అని చెప్పిన నెహ్రా అతను ఆటను బాగా అర్ధం చేసుకున్నాడు. ఇక ఓ పేసర్ కెప్టెన్ కావద్దు అని ఎక్కడ లేదు అని చెప్పాడు.