Usman Tariq Controversy: భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?.. పాక్ బౌలర్ తారిక్ ఫైర్!
- ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
- వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు
- భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Usman Tariq Slams Sri Lankan Police for Security Bias Against India Match: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానం వెలుపల భద్రత విషయంలో వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంక పోలీసులు భారత ఆటగాళ్ల పట్ల సానుకూలంగా ఉంటూ.. తమ పట్ల కఠినంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశాడు.
ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ… ‘మేము భారత్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడటం లేదు. గెలుపు, ఓటములు ఆటలో భాగం. కానీ మా ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరి బ్యాగులను శ్రీలంక పోలీసులు రెండు సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో భారత ఆటగాళ్ల బ్యాగులను మాత్రం కనీసం చెక్ చేయకుండానే పంపించేశారు. మాపై ఈ విధమైన పక్షపాతం ఎందుకు చూపుతున్నారు?’ అని ప్రశ్నించాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఆటగాళ్లందరికీ సమానమైన భద్రతా నిబంధనలు ఉండాలని, కానీ శ్రీలంకలో మాత్రం పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారని తారిక్ ఆరోపించారు.
Also Read
- Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
హోటల్ నుంచి స్టేడియానికి వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే సమయంలోనూ తనిఖీల పేరుతో పాకిస్థాన్ ఆటగాళ్లను ఎక్కువ సమయం వేచి ఉండేలా చేస్తున్నారని ఉస్మాన్ తారిక్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు ఏమైనా ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశాడు. భారత ఆటగాళ్లకు ఓ రూల్, పాక్ ప్లేయర్లకు మరో రూలా? అంటూ లంక పోలీసులపై తారిక్ ఫైర్ అయ్యాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు క్రికెట్ అభిమానులు భద్రత విషయంలో రాజీ పడకూడదని అంటుండగా, మరికొందరు ఒకే టోర్నీలో రెండు జట్ల మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. తారిక్ వ్యాఖ్యలపై ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!