Usman Tariq Controversy: భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?.. పాక్ బౌలర్ తారిక్ ఫైర్!
- ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
- వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు
- భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Usman Tariq Slams Sri Lankan Police for Security Bias Against India Match: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానం వెలుపల భద్రత విషయంలో వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంక పోలీసులు భారత ఆటగాళ్ల పట్ల సానుకూలంగా ఉంటూ.. తమ పట్ల కఠినంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశాడు.
ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ… ‘మేము భారత్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడటం లేదు. గెలుపు, ఓటములు ఆటలో భాగం. కానీ మా ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరి బ్యాగులను శ్రీలంక పోలీసులు రెండు సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో భారత ఆటగాళ్ల బ్యాగులను మాత్రం కనీసం చెక్ చేయకుండానే పంపించేశారు. మాపై ఈ విధమైన పక్షపాతం ఎందుకు చూపుతున్నారు?’ అని ప్రశ్నించాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఆటగాళ్లందరికీ సమానమైన భద్రతా నిబంధనలు ఉండాలని, కానీ శ్రీలంకలో మాత్రం పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారని తారిక్ ఆరోపించారు.
Also Read
- Tim David Bike Celebration: బంగ్లాదేశ్పై ఆసీస్ క్లీన్స్వీప్.. బైక్పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
- ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
- Virat Kohli: ప్రతి మ్యాచ్కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?
- Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
హోటల్ నుంచి స్టేడియానికి వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే సమయంలోనూ తనిఖీల పేరుతో పాకిస్థాన్ ఆటగాళ్లను ఎక్కువ సమయం వేచి ఉండేలా చేస్తున్నారని ఉస్మాన్ తారిక్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు ఏమైనా ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశాడు. భారత ఆటగాళ్లకు ఓ రూల్, పాక్ ప్లేయర్లకు మరో రూలా? అంటూ లంక పోలీసులపై తారిక్ ఫైర్ అయ్యాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు క్రికెట్ అభిమానులు భద్రత విషయంలో రాజీ పడకూడదని అంటుండగా, మరికొందరు ఒకే టోర్నీలో రెండు జట్ల మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. తారిక్ వ్యాఖ్యలపై ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
-
UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్హామ్! భారత్కు లాభమా? నష్టమా?
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!