Usman Tariq Controversy: భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?.. పాక్ బౌలర్ తారిక్ ఫైర్!
- ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
- వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు
- భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Usman Tariq Slams Sri Lankan Police for Security Bias Against India Match: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానం వెలుపల భద్రత విషయంలో వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంక పోలీసులు భారత ఆటగాళ్ల పట్ల సానుకూలంగా ఉంటూ.. తమ పట్ల కఠినంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశాడు.
ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ… ‘మేము భారత్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడటం లేదు. గెలుపు, ఓటములు ఆటలో భాగం. కానీ మా ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరి బ్యాగులను శ్రీలంక పోలీసులు రెండు సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో భారత ఆటగాళ్ల బ్యాగులను మాత్రం కనీసం చెక్ చేయకుండానే పంపించేశారు. మాపై ఈ విధమైన పక్షపాతం ఎందుకు చూపుతున్నారు?’ అని ప్రశ్నించాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఆటగాళ్లందరికీ సమానమైన భద్రతా నిబంధనలు ఉండాలని, కానీ శ్రీలంకలో మాత్రం పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారని తారిక్ ఆరోపించారు.
Also Read
- Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
- Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
- Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్లో.. ఇప్పుడు రికార్డులు..!
హోటల్ నుంచి స్టేడియానికి వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే సమయంలోనూ తనిఖీల పేరుతో పాకిస్థాన్ ఆటగాళ్లను ఎక్కువ సమయం వేచి ఉండేలా చేస్తున్నారని ఉస్మాన్ తారిక్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు ఏమైనా ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశాడు. భారత ఆటగాళ్లకు ఓ రూల్, పాక్ ప్లేయర్లకు మరో రూలా? అంటూ లంక పోలీసులపై తారిక్ ఫైర్ అయ్యాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు క్రికెట్ అభిమానులు భద్రత విషయంలో రాజీ పడకూడదని అంటుండగా, మరికొందరు ఒకే టోర్నీలో రెండు జట్ల మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. తారిక్ వ్యాఖ్యలపై ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
-
Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!