Ajay Jadeja: ఏడు గంటలు ఎవరు ఆడుతారు.. వన్డే క్రికెట్పై బాంబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Jadeja Gives Blunt Response On Future Of ODIs: ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వన్డే ఫార్మాట్పై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ క్రికెట్ షెడ్యూల్ నుంచి వన్డే ఫార్మాట్నే తొలగించాలని బాంబ్ పేల్చారు. ఈ ఫార్మాట్పై మునుపటిలా ఆసక్తి లేదని, ఎక్కువ సమయం వృధా అవుతోందని, దానికి పూర్తి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందంటూ కుండబద్దలు కొట్టారు. అప్పుడు మరో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీది రంగంలోకి దిగి.. వన్డేని 40 ఓవర్లకు కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అతని ప్రతిపాదనకు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం మద్దతు తెలిపాడు.
ఇంతకుముందు 60 ఓవర్లున్న వన్డే పార్మాట్ను 50 ఓవర్లకు కుదించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని 40 ఓవర్లలకు కుదిస్తే మంచిదని రవిశాస్త్రి పేర్కొన్నారు. అంతేకాదు.. 40 ఓవర్లలకు కుదిస్తే, వన్డేకు పూర్వవైభవం రావడంతో పాటు మునుపటి కన్నా మరింత ఆదరణ వస్తుందన్నారు. ఇప్పుడు టీ20కి ఎంత క్రేజ్ ఉందో, దానికి సమానంగానే వన్డే ఫార్మాట్ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతరులు కూడా అలాంటి అభిప్రాయాల్నే వ్యక్తపరుస్తూ.. వన్డే క్రికెట్కు పూర్వవైభవం రావాలంటే, మల్టీ సిరీస్లతో పాటు ట్రయాంగులర్ సిరీస్లను ఎక్కువగా ఆడిస్తే మంచిదని చెప్తున్నారు. తాజాగా అజయ్ టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం రవిశాస్త్రి తరహాలోనే వన్డేను కొత్తగా డిజైన్ చేయాలని, లేదంటే ఈ ఫార్మాట్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
Also Read
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
- Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
‘‘టెస్టులతో వన్డే క్రికెట్ను ఎప్పుడూ పోల్చలేం కానీ.. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. టి20 మ్యాచ్ పుణ్యమా అని మూడు గంటల్లోనే ఫలితం వస్తోంది. అదే వన్డే మ్యాచ్లో ఏడు గంటలు ఆడాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా.. త్వరగా ఫలితం వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆటగాళ్లు టీ20పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు? వన్డే క్రికెట్ను సరికొత్తగా డిజైన్ చేయాలి.. లేకపోతే ఆ ఫార్మాట్తో త్వరలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని జడేజా తెలిపారు. సర్వత్రా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి.. వన్డేను 40 ఓవర్లకు కుదించొచ్చని అనిపిస్తోంది.
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!