Ajay Jadeja: ఏడు గంటలు ఎవరు ఆడుతారు.. వన్డే క్రికెట్పై బాంబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Jadeja Gives Blunt Response On Future Of ODIs: ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వన్డే ఫార్మాట్పై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ క్రికెట్ షెడ్యూల్ నుంచి వన్డే ఫార్మాట్నే తొలగించాలని బాంబ్ పేల్చారు. ఈ ఫార్మాట్పై మునుపటిలా ఆసక్తి లేదని, ఎక్కువ సమయం వృధా అవుతోందని, దానికి పూర్తి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందంటూ కుండబద్దలు కొట్టారు. అప్పుడు మరో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీది రంగంలోకి దిగి.. వన్డేని 40 ఓవర్లకు కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అతని ప్రతిపాదనకు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం మద్దతు తెలిపాడు.
ఇంతకుముందు 60 ఓవర్లున్న వన్డే పార్మాట్ను 50 ఓవర్లకు కుదించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని 40 ఓవర్లలకు కుదిస్తే మంచిదని రవిశాస్త్రి పేర్కొన్నారు. అంతేకాదు.. 40 ఓవర్లలకు కుదిస్తే, వన్డేకు పూర్వవైభవం రావడంతో పాటు మునుపటి కన్నా మరింత ఆదరణ వస్తుందన్నారు. ఇప్పుడు టీ20కి ఎంత క్రేజ్ ఉందో, దానికి సమానంగానే వన్డే ఫార్మాట్ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతరులు కూడా అలాంటి అభిప్రాయాల్నే వ్యక్తపరుస్తూ.. వన్డే క్రికెట్కు పూర్వవైభవం రావాలంటే, మల్టీ సిరీస్లతో పాటు ట్రయాంగులర్ సిరీస్లను ఎక్కువగా ఆడిస్తే మంచిదని చెప్తున్నారు. తాజాగా అజయ్ టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం రవిశాస్త్రి తరహాలోనే వన్డేను కొత్తగా డిజైన్ చేయాలని, లేదంటే ఈ ఫార్మాట్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
‘‘టెస్టులతో వన్డే క్రికెట్ను ఎప్పుడూ పోల్చలేం కానీ.. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. టి20 మ్యాచ్ పుణ్యమా అని మూడు గంటల్లోనే ఫలితం వస్తోంది. అదే వన్డే మ్యాచ్లో ఏడు గంటలు ఆడాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా.. త్వరగా ఫలితం వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆటగాళ్లు టీ20పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు? వన్డే క్రికెట్ను సరికొత్తగా డిజైన్ చేయాలి.. లేకపోతే ఆ ఫార్మాట్తో త్వరలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని జడేజా తెలిపారు. సర్వత్రా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి.. వన్డేను 40 ఓవర్లకు కుదించొచ్చని అనిపిస్తోంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?