క్రికెట్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది.
Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టులో అల్లా నూర్ (25), అబ్దుల్ హాదీ (37), నూర్ అహ్మద్ (30) మాత్రమే రాణించారు. శ్రీలంక బౌలర్లలో వినుజా రాంపాల్ 5 వికెట్లు సాధించాడు. అయితే శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యం నిలవడంతో అందరూ ఆ జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని భావించారు. కానీ ఆప్ఘనిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది. శ్రీలంక జట్టులో కెప్టెన్ దునిత్ (34) మాత్రమే రాణించడంతో ఆ జట్టు ఓటమి పాలయ్యింది. మొత్తం నలుగురు రనౌట్ అయ్యారు. కాగా ఫిబ్రవరి 1న సెమీస్లో ఇంగ్లండ్తో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది.