2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
- వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్
- 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్
- ఫైనల్లో ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 వరల్డ్కప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు బ్యాటింగ్లో సత్తా చాటింది. ఇంగ్లాండ్తో హరారేలో జరుగుతున్న టైటిల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ బాదాడు. వరుస బౌండరీలు, సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 218.75 స్ట్రైక్రేట్తో అతను ఆడిన దూకుడైన ఇన్నింగ్స్ ఫైనల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలోనే 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదాడు. సెంచరీ అనంతరం వైభవ్ మరింత చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. వైభవ్ ఊపు చూస్తే సునాయాసంగా డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో మానీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో వైభవ్ సుడిగాలి ఇన్నింగ్స్కు తెరపడింది. ఇంగ్లాండ్బౌలర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
Also Read: Euphoria Movie Review: ‘యుఫోరియా’ రివ్యూ.. గుణశేఖర్ సక్సెస్ అందుకున్నారా?
కెప్టెన్ ఆయుష్ మహాత్రే 53 పరుగులు చేసి మంచి సహకారం అందించగా.. వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), అభిగ్యాన్ కుందు (40) కీలక పరుగులు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 పరుగులతో వేగంగా ఆడడంతో భారత్ స్కోర్ 400 దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గన్, అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో భారత్ ఫైనల్లో 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఈ భారీ స్కోర్ను చేధించడం ఇంగ్లాండ్ జట్టుకు పెను సవాలులే అని చెప్పాలి.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!